HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Telangana Bjp To Make Closing Event Of Bandi Yatra With Pomp And Show

TS BJP: అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ప్రజా ‘సంగ్రామ యాత్ర’ ముగింపు సభ. – బండి సంజయ్’..!

రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను బీజేపీ రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

  • By Hashtag U Published Date - 08:06 PM, Sun - 8 May 22
  • daily-hunt
Telangana BJP
Sanjay bandi

రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను బీజేపీ రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ సమీపంలో నిర్వహించే ముగింపుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్న సంగతి తెలిసిందే.

ఈ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున జనాన్ని సమీకరించి లక్షలాది మందితో సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. బూత్ అధ్యక్షుడు సహా ప్రతి పోలింగ్ బూత్ నుండి కనిష్టంగా 20 మందిని తరలించాలని, నియోజకవర్గానికి 5 వేలకు తక్కువ కాకుండా ప్రజలను, కార్యకర్తలు ముగింపు సభకు హజరయ్యేలా ప్రణాళిక రూపొందించింది. కాంగ్రెస్ ఇటీవల వరంగల్ లో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ కంటే నాలుగైదు రెట్లు అధికంగా ప్రజలను సమీకరించి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలను గట్టిగా ప్రజల్లోకి పంపాలని భావిస్తోంది. అందులో భాగంగా బండి సంజయ్ కుమార్ గత రెండ్రోజులుగా వరుసగా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. జిల్లాల వారీగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

శనివారం జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లతో సమావేశమైన బండి సంజయ్… పాదయాత్ర ముగింపు సభ విజయవంతానికి అవసరమైన జన సమీకరణ, తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. అలాగే ఈరోజు (ఆదివారం) సాయంత్ర్రం పార్టీ మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో వేర్వేరుగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో చేపట్టిన రెండో విడత పాదయాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోందని, ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి సమస్యలను చెప్పుకుంటున్నారని చెప్పారు.

పాలమూరు జిల్లా ఎడారిని తలపిస్తోందని, ఎటు చూసినా సమస్యలే తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు దుస్థితి చూసి చలించని, కన్నీళ్లు పెట్టని వారుండరని అన్నారు. జనం స్వచ్ఛందంగా పాదయాత్రకు తరలివస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. పాదయాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్, గద్వాల్, మక్తల్, నారాయణపేట, మహబూబ్ నగర్ కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభలు సక్సెస్ అయ్యాయన్నారు. వీటికి కొనసాగింపుగా కనీవినీ ఎరగని రీతిలో పాదయాత్ర ముగింపు సభకు జనాన్ని తరలించాలని సూచించారు.

ఈ సభ సక్సెస్ ద్వారా బీజేపీ అధికారంలో రాబోతుందనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలని పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రతి బూత్ అధ్యక్షుడు తనతోపాటు 10 నుండి 20 మందిని సభకు తీసుకురావాలని కోరారు. దూర ప్రాంతాల మండలాల నుండి వెయ్యి నుండి 5 వేల వరకు, హైదరాబాద్ సమీప జిల్లాలు, మండలాల నుండి 5 నుండి 10 వేల చొప్పున జన సమీకరణ చేయాలని సూచించారు. అందులో భాగంగా పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా విచ్చేస్తున్నారనే విషయాన్ని ఊరూవాడా ప్రచారం చేయాలని కోరారు.

ఎక్కడిక్కడ డప్పు చాటింపులు, ర్యాలీలు, మీడియా సమావేశాలతోపాటు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి ఒక్కరూ సభకు హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు. దీంతోపాటు రేపటి నుండి మండలాలు, జిల్లాల కేంద్రాల్లో కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, కరెంట్ బిల్లులను దగ్దం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల మైనారిటీల చేతిలో హత్యకు గురైన దళిత బిడ్డ నాగరాజు ఘటనలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని సూచించారు బండి సంజయ్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • Bandi Sanjay
  • closing ceremony of praja sangrama yatra
  • praja sangrama yatra
  • Telangana BJP

Related News

There is no truth in the opposition's allegations.. This provision also applies to Modi: Amit Shah

Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

Amit Shah : సెప్టెంబర్ 6వ తేదీన ఆయన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

  • Tarun Chugh

    Tarun Chugh : ‘మోడరన్ జిన్నా’ మమత అంటూ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు

Latest News

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd