Poland: పోలాండ్ లో మైనర్ బాలిక హత్య..
పోలాండ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల మైనర్ బాలికను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వాస్తవానికి పోలాండ్లోని సెంట్రల్ సిటీ లాడ్జ్లోని అనాథ శరణాలయంలో
- By Praveen Aluthuru Published Date - 02:35 PM, Wed - 10 May 23
Poland: పోలాండ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల మైనర్ బాలికను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వాస్తవానికి పోలాండ్లోని సెంట్రల్ సిటీ లాడ్జ్లోని అనాథ శరణాలయంలోకి బలవంతంగా ప్రవేశించిన వ్యక్తి మంగళవారం అర్థరాత్రి టీనేజ్ అమ్మాయిని చంపాడు. అదే సమయంలో మరో తొమ్మిది మందిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. మంగళవారం అర్థరాత్రి 2:30 గంటలకు ఈ దారుణం చోటు చేసుకున్నట్టు సమాచారం.
గుర్తు తెలియని వ్యక్తి నగరానికి సమీపంలోని టోమిస్లావిస్ గ్రామంలోని అనాథాశ్రమంలోకి ప్రవేశించినట్లు అర్థరాత్రి పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత పదునైన కత్తితో స్థానికులపై దాడి చేసి మైనర్ బాలికను హత్య చేశాడు. ఈ ఘటనను పోలీసు అధికార ప్రతినిధి అనితా సోబీరాజ్ తీవ్రంగా ఖండించారు. అనాథ శరణాలయంలోని 16 ఏళ్ల బాలికను అతి కిరాతకంగా హత్య చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో, గాయపడిన మిగిలిన తొమ్మిది మందిని ఆసుపత్రిలో చేర్చారు, వారిలో ఐదుగురి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు.
Read More: AP Capital : జగన్నాటకంలో అమరావతి
Related News
Farmers Protest In Poland: ఐరోపా దేశంలో కూడా రోడ్డెక్కిన రైతన్నలు.. 500 ట్రాక్టర్లతో 1000 మంది నిరసన..!
ఐరోపా దేశమైన పోలాండ్లోని రైతులు కూడా తమ డిమాండ్ల కోసం నిరసన (Farmers Protest In Poland)లు చేస్తున్నారు. 500 ట్రాక్టర్లతో 1000 మంది రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.