HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Tears Of Joy As 1st Batch Of Indians Returns From Sudan

Operation Kaveri: సుడాన్ నుంచి భారత్ చేరుకున్న బాధితుల కన్నీటి గాధ

సుడాన్ అంతర్యుద్ధం కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. అక్కడి సైన్యం మరియు పారామిలటరీ మధ్య సంధి కుదరకపోవడంతో అల్లర్లు చెలరేగాయి

  • By Praveen Aluthuru Published Date - 11:52 AM, Thu - 27 April 23
  • daily-hunt
Operation Kaveri
New Web Story Copy (48)

Operation Kaveri: సుడాన్ అంతర్యుద్ధం కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. అక్కడి సైన్యం మరియు పారామిలటరీ మధ్య సంధి కుదరకపోవడంతో అల్లర్లు చెలరేగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సుడాన్ లో ఇరుక్కున్న విదేశీయులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ దేశాల ప్రతినిధులు తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగా భారత ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.

సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో సుమారు 4000 మంది భారతీయులు చిక్కుకుపోయారు, వారిలో 1100 మంది సురక్షిత ప్రదేశానికి చేరుకున్నారు.  3 బ్యాట్లలో దాదాపు 670 మంది పౌరులు భారతదేశానికి చేరుకున్నారు. కాగా.. భారత్ కు చేరుకున్న బాధితులు సుడాన్ లో ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. హర్యానాకు చెందిన సుఖ్‌విందర్ మాట్లాడుతూ..మేము మరణ శయ్యపై ఉన్నట్లు అనిపించింది. ఎప్పుడెప్పుడు మా ప్రాణాలు పోతాయా అంటూ బిక్కుబిక్కుమంటూ బ్రతికాము అని గోడు వెళ్లబోసుకున్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కావేరి కింద మొదటి బ్యాచ్‌లో భారతదేశానికి చేరుకున్నాడు సుఖ్‌విందర్. సుఖ్వీందర్ వృత్తిరీత్యా ఇంజనీర్. ఆయన హర్యానాలోని ఫరీదాబాద్ నివాసి.

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన ఛోటూ సూడాన్‌లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఛోటూ సుడాన్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాడు. కానీ నేను ఇండియాలో అడుగుపెడతానని కలలో కూడా అనుకోలేదు అన్నాడు. నేను చనిపోయాక భారత్ కు తిరిగి వచ్చినట్టు అనిపిస్తుందని కన్నీరు పెట్టుకున్నారు. తాను ఇంకెప్పుడూ సూడాన్‌కు వెళ్లనని చెప్పాడు. నేను నా దేశంలో ఉంటూ ఏదైనా పని చేసుకుంటానని అన్నాడు.

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ నివాసి తస్మర్ సింగ్ (60)ను సూడాన్ నుంచి భారత్‌కు సురక్షితంగా తీసుకొచ్చారు. సూడాన్‌లో జరుగుతున్న ఘర్షణల సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని భయానకమైనదని ఆయన వివరించారు. కరెంటు, నీళ్లు లేని చిన్న ఇంట్లో సచ్చిన శవంలా బ్రతికామని గుర్తు చేసుకున్నాడు. జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు, కానీ జీవించి ఉన్నందుకు దేవునికి ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న వారిలో 19 మంది కేరళ నివాసులు.

సుడాన్ (Sudan)నుంచి ఢిల్లీ (Delhi) విమానాశ్రయానికి చేరుకున్న బాధితులకు వెల్కమ్ చెప్పారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో వారి ఫోటోలను షేర్ చేశారు.సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరీ’ని ప్రారంభించింది. ఇందుకోసం ఎయిర్ ఫోర్స్, నేవీల సాయం తీసుకుంటున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, సౌదీ అరేబియాలోని జెడ్డాలో భారత వైమానిక దళానికి చెందిన రెండు C-130J విమానాలు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా నౌకాదళ నౌక ఐఏఎన్ఎస్ సుమేధ కూడా పోర్ట్ సూడాన్ చేరుకుంది. మొదట భారతీయులను ఈ నౌక ద్వారా జెడ్డాకు తీసుకువస్తున్నారు మరియు ఇక్కడి నుండి ప్రజలు C-130J ద్వారా న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.

Read More: Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. కారణమిదేనా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • indians
  • Operation Kaveri
  • Sudan
  • Sudan evacuation
  • Sudan Voilence

Related News

A terrible tragedy in Sudan.. More than 1000 people died in landslides

Landslide : సూడాన్‌లో తీవ్ర విషాదం..కొండ చరియలు విరిగి 1000 మందికి పైగా మృతి

ఇటీవల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో భూమి సంభాలుకోలేని స్థితికి చేరింది. ఈ విపత్తులో ఒక పూర్తి గ్రామం శిథిలాల కిందకు దిమ్మతిరిగిపోయింది. గ్రామంలోని ప్రజలంతా మరణించగా, కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగాడు.

    Latest News

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd