Atmakur ByElections : ఆత్మకూరు బరిలో బీజేపీ, వైసీపీ
- By CS Rao Published Date - 04:15 PM, Thu - 2 June 22
ఆత్మకూరు ఉప ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే, వచ్చే ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలనే విధానం ఆ పార్టీ ఎప్పటి నుంచో అనుసరిస్తోంది. ఆ క్రమంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎన్నికలకు దూరంగా ఉంది. ఇదే విధానాన్ని జనసేన కూడా అనుసరిస్తోంది. కానీ, ఆ పార్టీతో భాగస్వామిగా ఉన్న బీజేపీ మాత్రం నామినేషన్ వేయడానికి సిద్ధం అయింది.
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా బుధవారం బీ ఫారం అందుకున్న విక్రమ్రెడ్డి గురువారం నేడు నామినేషన్ దాఖలు పరిచారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. బైపాస్రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో విక్రమ్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
అనంతరం విక్రమ్రెడ్డి మాట్లాడుతూ.. ‘నామినేషన్కు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు అందరూ రావడం సంతోషం. ఈ ఎన్నికలు నాకు కొత్త. అయినా సీరియస్గా తీసుకుని పని చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.
Related News
Anam Venkata Ramana Reddy : భారతి రెడ్డి రాళ్ల దాడి డ్రామాను రూపొందించారు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్పై శనివారం సాయంత్రం రాళ్లు రువ్వడంతో ఆయనకు గాయాలయ్యాయి.