Tamil nadu : దీపావళి క్రాకర్స్ పై ఆంక్షలు..!!
దీపావళి దేశప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ. చీకట్లను తొలగిస్తూ...జీవితంలో వెలుగులు నింపే ఈ వేడుక ఇల్లంతా దీపాలత అలంకరిస్తారు.
- By hashtagu Published Date - 06:39 AM, Tue - 11 October 22
దీపావళి దేశప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ. చీకట్లను తొలగిస్తూ…జీవితంలో వెలుగులు నింపే ఈ వేడుక ఇల్లంతా దీపాలత అలంకరిస్తారు. క్రాకర్స్,బానసంచా పేళ్లుళ్లతో సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ దీపావళికి కాల్చే క్రాకర్స్ వల్ల కాలుష్యం గణనీయంగా పెరుగుతుండటం, పక్షులు, ఇతర జీవ జాతులపై ప్రభావం చూపుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు బాణాసంచా కాల్చడంపై ఆంక్షలు విధించాయి. ఈ ఏడాది కూడా అవే ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించాయి.
తమిళనాడులో దీపావళి వేడుకలకు బాణాసంచా పేల్చడంలో ఎలాంటి మార్పులు లేవని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఉదయం 6 నుంచి 7 వరకు సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని ప్రకటించింది. బాణాసంచా కాల్చడానికి సంబంధించి 2019 నుంచి పరిమితులు అమలులో ఉన్నాయి. 2018లో క్రాకర్స్ అమ్మకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ నిబంధనలు ఉండటంతో బాణాసంచా విక్రయించడానికి ఈ కామర్స్ వెబ్ సైట్స్ కు అనుమతి లేదు.
అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ క్రాకర్స్ కాల్చడం, విక్రయించడంపై నిషేధం యాథావిధంగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు సోమవారి తెలిపింది. ఢిల్లీలో బాణా సంచాపై నిషేధాన్ని ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
Related News
666 Crores Jewels : రూ.666 కోట్ల బంగారు ఆభరణాల కంటెయినర్ బోల్తా.. ఏమైందంటే ?
666 Crores Jewels : రూ.666 కోట్లు విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడింది.