IPL Playoffs: ‘డూ ఆర్ డై’ పోరులో నిలిచేది ఎవరో ?
ఐపీఎల్ 2022 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ కోల్కతా నైట్రైడర్స్ తో
- By Balu J Published Date - 05:18 PM, Sat - 14 May 22
ఐపీఎల్ 2022 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ కోల్కతా నైట్రైడర్స్ తో జరిగే కీలక పోరులో తప్పక గెలవాల్సి ఉంది. ఈ సీజన్లో సన్రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్లపట్టికలో 7వ స్థానంలో ఉండగా… కేకేఆర్ 12 మ్యాచ్ల్లో 5 విజయాలతో 8వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇరు జట్లు ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సీజన్ లో సన్రైజర్స్ హైరదాబాద్ చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ దారుణంగాఓడిపోగా.. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మాత్రం.. చివరి నాలుగు మ్యాచ్లలో రెండింటిలో విజయం సాధించింది., ఇక బ్యాటింగ్ పరంగా ఎస్ఆర్హెచ్ సీజన్ ఫస్టాఫ్ లో అద్భుతంగా రాణించినప్పటికీ సెకండాఫ్ లో మాత్రం పేలవంగా విఫలమవుతుతోంది. హైదరాబాద్ బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. గత 4 మ్యాచ్ల్లో కూడా ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో కలిసి కట్టుగా రాణించి ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలని విలియంసన్ సేన భావిస్తోంది.
ఇక సన్ రైజర్స్ , కేకేఆర్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. శ్రేయాస్ అయ్యర్ సేనదేపైచేయిలా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 22 మ్యాచ్ల్లో పోటీపడగా.. ఇందులో 14 మ్యాచ్ల్లో కేకేఆర్ విజయం సాధించింది. మిగిలిన 8 మ్యాచ్ల్లో మాత్రమే ఆరెంజ్ ఆర్మీ గెలిచింది. ఇక ఐపీఎల్ 15వ సీజన్లో ఏప్రిల్ 15న ఈ రెండు జట్లు ఒకసారి తలపడగా.. ఆ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్కు చేరబోయే 4 జట్లలో గుజరాత్ టైటాన్స్ తొలి బెర్తు కన్ఫర్మ్ చేసుకోగా, మిగిలిన 3 స్థానాల కోసం 7 జట్లు పోటీపడుతున్నాయి.
Related News
Asaduddin Owaisi Assets: అసదుద్దీన్ ఒవైసీ ఆస్తి వివరాలు.. సొంత కారు లేదట
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన ఆస్తి వివరాలను ప్రకటించారు. 2019 లో ప్రకటించిన ఆస్తులు రూ.13 కోట్ల కాగా 2014 సమయానికి రూ. 23.87 కోట్లుగా చూపించారు.