WFI – Sports Ministry : డబ్ల్యుఎఫ్ఐ కొత్త కార్యవర్గం సస్పెండ్.. ఎందుకు ?
WFI - Sports Ministry : కేంద్ర క్రీడా శాఖ ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది.
- By Pasha Published Date - 01:52 PM, Sun - 24 December 23
WFI – Sports Ministry : కేంద్ర క్రీడా శాఖ ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కార్యవర్గాన్ని సస్పెండ్ చేసింది. నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త కార్యవర్గాన్ని ఇంకా పాత అధికారులు, పాత కార్యవర్గంలోని వాళ్లే కంట్రోల్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని కేంద్ర క్రీడా శాఖ(WFI – Sports Ministry) వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే కేంద్ర క్రీడాశాఖ నుంచి ఇంకా తనకు సస్పెన్షన్ ఉత్తర్వు అందలేదని కొత్త డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్ వెల్లడించారు. మొదట లేఖను చూసి, ఆ తర్వాత మాట్లాడుతానని ఆయన చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
సస్పెన్షన్కు కారణాలు ఏమిటి ?
40-7 ఓట్ల తేడాతో డబ్ల్యుఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ డిసెంబర్ 21న ఎన్నికయ్యారు. వివాదాస్పదుడిగా పేరొందిన మాజీ డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు సంజయ్ సింగ్ చాలా క్లోజ్ అనే ప్రచారం మీడియాలో నడిచింది. ఈనెల 21న సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. డబ్ల్యుఎఫ్ఐ అండర్-15, అండర్-20 నేషనల్స్ టోర్నమెంట్లను ఈ ఏడాది చివరికల్లా నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ఇలా అనధికారికంగా ప్రకటన చేయడాన్ని కేంద్ర క్రీడాశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ ఏడాదిలో మరో వారం రోజుల టైం మాత్రమే మిగిలింది. ఇటువంటి తరుణంలో అకస్మాత్తుగా టోర్నమెంట్ నిర్వహణపై సంజయ్ సింగ్ అనౌన్స్మెంట్ చేయడాన్ని తప్పుపట్టింది.
Also Read: Priyanka Gandhi : ప్రియాంకాగాంధీ యూపీ బాధ్యతలు అవినాష్ పాండేకు.. ఎవరాయన ?
టోర్నమెంట్ల నిర్వహణకు కనీసం 15 రోజుల ముందు రెజ్లర్లకు సూచనలతో కూడిన నోటీసులు ఇవ్వాలనే నిబంధనను కొత్త డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ ఉల్లంఘించారని కేంద్ర క్రీడా శాఖ వాదిస్తోంది. కనీసం 15 రోజుల ముందు సమాచారమిస్తే రెజ్లర్లు ప్రాక్టీస్తో ప్రిపేరయ్యే అవకాశం ఉంటుందని చెబుతోంది. ఇటువంటి నిర్ణయాలను డబ్ల్యుఎఫ్ఐ కార్యనిర్వాహక మండలి (ఈసీ) సమావేశం నిర్వహించి, కనీస సంఖ్యలో సభ్యుల మద్దతుతో తీసుకోవాల్సి ఉంటుందని క్రీడాశాఖ అంటోంది. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లేందుకు సంజయ్ సింగ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై చర్చించేందుకు తనను కలవాలని మాజీ డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆదేశించారు. దీంతో నడ్డాను కలిసేందుకు బ్రిజ్ భూషణ్ వెళ్లారు.
Related News
Vinesh Phogat: ఫుట్పాత్పై వినేష్ ఫోగట్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు
డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో తనకు దక్కిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని వినేష్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.