Uttar Pradesh: రెండవ పెళ్లికి కొడుకు అడ్డుగా ఉన్నానని అలాంటి పని చేసిన తండ్రి?
ఇటీవల కాలంలో చాలామంది శారీరక సుఖం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. కొంతమంది ఎదుటి వ్యక్తులను చంపడానికి
- By Nakshatra Published Date - 03:45 PM, Mon - 28 August 23
ఇటీవల కాలంలో చాలామంది శారీరక సుఖం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. కొంతమంది ఎదుటి వ్యక్తులను చంపడానికి కూడా వెనకాడడం లేదు. పదినిమిషాల పడక సుఖం కోసం జీవితాలను చేజేతులా నాశనం చేసుకోవడంతో పాటు ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి యూపీలో కూడా వెలుగులోకి వచ్చింది. పెళ్లి కోసం ఏకంగా కన్న కొడుకుని హత్య చేశాడు ఒక కసాయి తండ్రి. ఈ కట్టిన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఘటన యూపీలోని ఛురా గ్రామంలో చోటుచేసుకుంది. కిరాయి హంతకులతో కుమారుడిని హత్య చేయించిన తండ్రి రిటైర్డ్ జవాను కావడం విశేషం. ప్రస్తుతం ఒక బ్యాంకులో గార్డుగా పనిచేస్తున్నాడు. తండ్రి సంజీవ్ కుమార్ రెండవ వివాహం చేసుకోవడం కుమారుడు సచిన్ కు ఇష్టం లేదు. ఈ నేపధ్యంలోనే తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సంజీవ్ అతని భార్య మునేష్ మధ్య గత 15 సంవత్సరాలుగా మనస్పర్థలు ఉండటంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వారి 27 ఏళ్ల ఏకైక కుమారుడు తల్లి మునేష్తో పాటు ఉంటున్నాడు. మునేష్ దేవి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ నేపధ్యంలోనే కుమారుడు సచిన్ ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లాడు. కుమారుడు ఎంతసేపటికీ ఆసుపత్రికి రాకపోవడంతో అనుమానంతో తల్లి మునేష్ కుమారుని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తండ్రి సంజీవ్పై అనుమానం కలిగింది. వెంటనే వారు అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మొదట్లో తనకు తెలియదని బుకాయించినా, తరువాత తానే తన కుమారుడిని రూ. 5 లక్షలకు సుపారీ కుదుర్చుకుని హత్య చేయించానని ఒప్పుకున్నాడు. పోలీసులు సంజీవ్పై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
Related News
Uttar Pradesh: ఇద్దరు యువకులతో మహిళ డాక్టర్ రాసలీలలు
ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా వైద్యురాలు ఇద్దరు మగ స్నేహితులతో కలిసి ఓ హోటల్లో పట్టుబడింది. సదరు మహిళా వైద్యురాలిని తన భర్త అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నాడు.