Solar Flare: సమాచార వ్యవస్థకు .. సూర్యుడి సవాల్ ?
సూర్యుడి పై ఉండే మచ్చల్లో ఏదో జరుగుతోంది ? తాజాగా ఈనెల 11న 'ఏఆర్ 2987' అని పిలిచే ఒక సన్ స్పాట్ (సూర్యుడి పై ఉండే ఒక మచ్చ) లో భారీ విస్ఫోటనం జరిగింది.
- By Hashtag U Published Date - 02:01 PM, Mon - 18 April 22
సూర్యుడి పై ఉండే మచ్చల్లో ఏదో జరుగుతోంది ? తాజాగా ఈనెల 11న ‘ఏఆర్ 2987’ అని పిలిచే ఒక సన్ స్పాట్ (సూర్యుడి పై ఉండే ఒక మచ్చ) లో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ పేలుడును సాంకేతిక భాషలో ‘ కరోనల్ మాస్ ఎజెక్షన్ ‘ అంటారు. ఈ విస్ఫోటనం నుంచి పెద్ద మొత్తంలో వెలువడిన సౌర పదార్ధంతో కూడిన సౌర తుఫాను భూమివైపు దూసుకొచ్చింది. మూడు రోజుల వ్యవధిలోనే (ఏప్రిల్ 14 లేదా 15) అది భూమికి అత్యంత ఎగువన ఉండే వాతావరణంలోకి చేరిందని నాసా చెబుతోంది. అయితే ‘జీ 2’ కేటగిరీకి చెందిన ఆ సౌర తుఫాను వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని కూడా నాసా తేల్చి చెప్పింది.
అసలు కథ ఇప్పుడే మొదలు..
అయితే అసలు కథ ఇప్పుడే మొదలైందని.. వచ్చే వారంలో మరిన్ని సౌర తుఫానులు సంభవించే అవకాశాలు ఉన్నాయని నేషనల్ ఓషియానిక్ అండ్ అటమాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ ( ఎన్.ఓ.ఏ.ఏ) హెచ్చరించింది. ఇటీవల చోటుచేసుకున్న విస్ఫోటనం నేపథ్యంలో.. సూర్యుడిపై ఉండే మచ్చలు ఒక చోటు నుంచి మరో చోటుకు కదలికలు సాగించే క్రమంలో మరిన్ని విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఏప్రిల్ 17న సూర్యుడిపై ఉన్న ‘ఏఆర్ 2993’, ‘ ఏఆర్2993′ అనే మచ్చల నుంచి కూడా ఎక్స్1 క్లాస్ సౌర పదార్ధాలు విడుదలయ్యానని ఎన్.ఓ.ఏ.ఏ శాస్త్రవేత్తలు గుర్తు చేశారు. వచ్చే వారంలో రాబోయే సౌర తుఫానులకు.. ఏఆర్ 2993’, ‘ ఏఆర్2993′ సన్ స్పాట్ లు కేంద్రంగా మారొచ్చని అంచనా వేశారు. ఈనేపథ్యంలో వీటిని ప్రస్తుతం నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ట్రాక్ చేస్తోంది. గత వారం రోజులుగా క్రియాశీలంగా ఉన్న ఏఆర్ 2993’, ‘ ఏఆర్2993’ సన్ స్పాట్ లలో నిరంతరాయంగా విస్ఫోటనాలు జరుగుతున్నాయని, అవి ప్లాస్మాను అంతరిక్షంలోకి విడుదల చేస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. కాగా, ఏప్రిల్ 11న చోటుచేసుకున్న సౌర తుఫాను వల్ల .. ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియా దేశాలలలో షార్ట్ వేవ్ రేడియో సిగ్నల్స్ కు విఘాతం కలిగింది. వచ్చే వారం సౌర తుఫానులు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా సమాచార సాంకేతిక వ్యవస్థలకు అవరోధం ఏర్పడొచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Related News
CM Revanth: సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహం: సీఎం రేవంత్
CM Revanth: విద్యుత్ సబ్స్టేషన్లలో స్థానికంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన వస్తు ఉత్పత్తుల స్టాల్స్ను సందర్శించి మహిళలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఇం