Hyderabad : హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎం సంజీవ్..
- By Prasad Published Date - 09:46 PM, Sun - 27 November 22
హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎం సంజీవ్ (31) శనివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్లో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. అయితే అకస్మాత్తుగా అసౌకర్యానికి గురై నేలపై కుప్పకూలిపోయాడు. సంజీవ్ని స్నేహితులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Related News
Alert: జర జాగ్రత్త.. ఐదు రోజుల్లో ఎండలే ఎండలు
Alert: రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 27 నుంచి 30 వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్నగర్, నల్గొండ, నారాయణపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది.రాగల ఐదురోజుల �