HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shock For Vehicle Owners In Ap Will Their Vehicles Be Seized From Now On

AP High Court: ఏపీలో వాహనదారులకు షాక్.. ఇకపై ఆ వాహనాలు సీజ్?

వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారి వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించింది.

  • Author : Kode Mohan Sai Date : 19-12-2024 - 12:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap High Court
Ap High Court

AP High Court: కర్ణాటకలో బైక్ మీద వెళ్లేవారందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. బైక్ వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. దీనిని కఠినంగా అమలు చేస్తూ, అక్కడి ట్రాఫిక్ పోలీసులు అందరూ ఈ నియమం తప్పక పాటిస్తున్నారు. హెల్మెట్ ధరించని వారు ఛలాన్ కూడా ఎదురుకుంటున్నారు. ఇక్కడ కర్ణాటక లో, రూల్ ప్రకారం ఎంత సీరియస్‌గా అమలవుతుందో, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఏపీ లో, హెల్మెట్ పెట్టుకునేవారి సంఖ్యా చాలా తక్కువ. దాంతో, హెల్మెట్ పెట్టుకునేవారిని చుట్టుపక్కల వారు చూసి నవ్వుతున్నారు. “ఆ హెల్మెట్ పెట్టుకునే అవసరం ఉందా?” అనే దృష్టితో చూస్తున్నారు. ఆ దశలో, హెల్మెట్ పెట్టుకోవాలని అనుకున్న వాళ్లు కూడా ఆ ఆలోచనను విడిచి వేయడం ప్రారంభించారు. ఈ పరిస్థితి చూసిన ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్రంలో 99 శాతం మంది హెల్మెట్ పెట్టుకోకుండా బైక్‌ వాహనాలు నడిపిస్తున్నారని మండిపడింది. “హెల్మెట్ లేకుండా బైకులు ఎలా నడుపుతున్నారు?” అని ప్రశ్నిస్తూ, “రూల్స్ ఎందుకు పాటించటం లేదు?” అంటూ తీవ్రంగా నిలదీశింది. ఈ అంశంపై ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలైంది. దానికి స్పందిస్తూ, కోర్టు, “బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాదు, వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి” అని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా హెల్మెట్ ధరించకుండా టూ-వీలర్ నడిపితే, వారికి ఫైన్ వేశేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఆ ఫైన్‌ ను 90 రోజుల్లో చెల్లించకపోతే, వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నిర్ణయంతో పాటు, హైకోర్టు ఇంకా ఒక కీలక ఆదేశం ఇచ్చింది. హెల్మెట్ ఫైన్, 90 రోజుల గడువు, వాహనం స్వాధీనం వంటి విషయాలను పేపర్లు, టీవీలు వంటి మీడియా ఛానెల్స్‌ లో యాడ్స్ రూపంలో ప్రజలకు తెలియజేయాలని ఆదేశించింది. అంతటితో కోర్టు ఈ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP E- Challan
  • AP high court
  • AP HighCourt Shocks To Two wheeler Vehicles
  • AP Traffic Police
  • New Guidelines To Two Wheeler Vehicles
  • Please Where Helmet

Related News

Bail Granted To Chevireddy

చెవిరెడ్డి భాస్కర్‌ కు భారీ ఊరట ! 226 రోజుల తర్వాత బెయిల్‌

గత ఏడాది జూన్ 17న బెంగళూరులో సిట్ (SIT) అధికారుల చేత అరెస్ట్ అయిన చెవిరెడ్డి, సుమారు 226 రోజుల పాటు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. భాస్కర్‌రెడ్డితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా న్యాయస్థానం బెయిల్ మంజూరు

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Latest News

  • ఏపీలో కొలువుల జాతర: ఉగాదికి జాబ్ క్యాలెండర్?

  • మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

  • ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు, డిమాండ్ చేయడమే ఆయన చేసిన తప్పా ?

  • పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ కన్నుమూత

  • అల్లు అరుణ్ కు జోడి గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ?

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd