Shloka Mehta: వామ్మో.. శ్లోకా మెహతా ధరించిన డైమండ్ నెక్లెస్ అన్నిరూ.వందల కోట్లా?
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామందికి ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతులదేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామందికి ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతుల
- By Nakshatra Published Date - 06:27 PM, Fri - 9 June 23
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామందికి ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతులలో ముఖేష్ అంబానీ కూడా ఒకరు. అయితే కోట్లాధిపతి కావడంతో ముఖేష్ అంబా ఆయన ఫ్యామిలీ ఏది చేసినా కూడా ప్రత్యేకమే అని చెప్పవచ్చు. వారు ధరించే చెప్పుల నుంచి ఆభరణాల వరకు ప్రతి ఒక్కటి కూడా కోట్లలో విలువ చేసేది అని చెప్పవచ్చు. ఇకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కోడలికి బహుమతిగా ఇచ్చిన ఖరీదైన డైమండ్ నెక్లెస్కు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఆ వార్త విన్న నెటిజన్స్ నోరేళ్ళ బెడుతున్నారు. అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతాకు గిఫ్ట్గా ఇచ్చిన రూ. 451 కోట్ల డైమండ్ నెక్లెస్ ఇక మార్కెట్లో కనిపించదట. కాగా శ్లోకా మెహతాకు ముఖేశ్, నీతా అంబానీలు బహుమతిగా ఇచ్చిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్గా నిలిచినసంగతి తెలిసిందే. మౌవాద్ ఎల్ సాటిలేని 91 డైమండ్ నెక్లెస్ ను వివాహ వేడుకలో శ్లోకా మెహతాకి ఈ నెక్లెస్ను బహుమతిగా ఇచ్చారు. ఇది ఇలా ఉంటే తాజా నివేదికల ప్రకారం డిజైన్ మార్పుకారణంగా ఈ ఖరీదైన డైమండ్ నెక్లెస్ సెట్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదట.
ఈ డైమండ్స్ పసుపు రంగును పెంచడానికి, మరింత బ్రైట్గా చేయడంతో డిజైన్లో కూడా మర్పులు చేసి రీకట్ చేశారట. ఫలితంగా దాదాపు 200 క్యారెట్ల విలువైన ఈ నెక్లెస్ బరువు 100 క్యారెట్లకు పైగా తగ్గింది. 2022లో సథెబీలో మౌవాద్ ఎల్ ఇన్కంపారబుల్ 91 డైమండ్ నెక్లెస్ ను ప్రదర్శించారు. కాగా శ్లోక మెహతా ఇటీవలే రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆకాశ్, శ్లోక దంపతులకు తొలి సంతానంగా, కుమారుడు పృథ్వి ఉన్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ఆ నెక్లెస్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది ఆ నెక్లెస్ ధర తెలిసి షాక్ అవుతున్నారు.
Related News
Richest People In India: భారతదేశంలోని టాప్ 10 సంపన్నులు వీరే.. వారి సంపాద ఎంతంటే..?
దేశంలోని ధనవంతుల జాబితాలో పెను మార్పు వచ్చింది. భారతీ ఎయిర్టెల్ షేర్లలో విపరీతమైన పెరుగుదల కారణంగా సునీల్ మిట్టల్ దేశంలోని టాప్ 10 సంపన్న భారతీయులలో చేరారు.