HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shashidhar Reddy Comments On Asaduddin Convoy Shooting

Owaisi attack: ఎంపీ ఒవైసీ పై కాల్పులు.. శ‌శిధ‌ర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు..!

యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్య‌క్ష‌డు అస‌దుద్ధీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

  • Author : HashtagU Desk Date : 04-02-2022 - 5:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1212
1212

యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్య‌క్ష‌డు అస‌దుద్ధీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఒవైసీ పై దాడి జరగడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా ఈ దాడి ఘ‌ట‌న పై నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మాజీ చైర్మ‌న్ ఎం శ‌శిధ‌ర్ రెడ్డి ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న ద్వారా స్పందిచారు.

ఎంపీ ఒవైసీ పై జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను ఖండిస్తూ.. ఆయ‌నకు ప్ర‌మాదంలో ఎలాంటి గాయాలు కాకుండా కేమంగా ప‌డ‌డం ఊర‌నిచ్చే విష‌య‌మ‌ని శ‌శిధ‌ర్ రెడ్డి అన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హోరాహోరీగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న, ప‌లు అనుమానాల‌కు దారి తీస్తోంద‌న్నారు. ఎన్నిక‌ల‌ను పోల‌రైజ్ చేసేందుకు బ‌ల‌మైన ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని శ‌శిధ‌ర్ రెడ్డి అన్నారు.

యూపీ ప్ర‌జ‌ల్లో మ‌త‌ప‌ర‌మైన ఉద్రిక్త‌త‌ల‌ను సృష్టించేందుకు ఇలాంటి దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, దీనికి బాధ్యులైన వారిని వెంట‌నే అరెస్ట్ చేయ‌డ‌మే కాకుండా, వారి వెనుక ఉన్నవారిని కూడా బ‌హిర్గ‌తం చేసేందుకు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయించాల‌ని శ‌శిధ‌ర్ రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎన్నో విభేదాలు ఉన్నా, ఇలాంటి ప్ర‌య‌త్నాలు ఏమాత్రం ఆమోద‌యోగ్యం కావ‌న్నారు.

ఇక ఓవైసీ భ‌ద్ర‌త గురించి తాను వ్య‌క్తిగ‌తంగా ఆందోళ‌ణ చెందుతున్నాన‌ని, వెంట‌నే ఆయ‌న‌కు త‌గిన భ‌ద్ర‌త ఏర్పాటు చేయాల‌ని శ‌శిధ‌ర్ రెడ్డి కోరారు. అనూహ్యంగా త‌న కాన్వాయ్ పై కాల్పులు జ‌రిగిన నేప‌ధ్యంలో ఒవైసీ ఇక‌ముందు మరింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వ్య‌క్తిగ‌తంగా కూడా అన్నిర‌కాలుగా భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. కాగా యూపీలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా, మీర‌ట్ నుండి తిరిగి వ‌స్తున్న ఎంపీ ఒవైసీ కాన్వాయ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

Whatsapp Image 2022 02 04 At 4.56.54 Pm


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asaduddin owaisi
  • attack on Owaisi
  • Marri Shashidhar Reddy

Related News

    Latest News

    • బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

    • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

    • మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

    • యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?

    • హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

    Trending News

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

      • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd