IPL 2022: షకీబుల్ ను అందుకే కొనలేదు
బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయారు. ఐపీఎల్ కెరీర్లోనే అత్యుత్తమ ఆటతీరు కనబర్చిన వారు కూడా కనీస ధరకు అమ్ముడు పోలేదు.
- By Naresh Kumar Published Date - 11:56 AM, Thu - 17 February 22
బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయారు. ఐపీఎల్ కెరీర్లోనే అత్యుత్తమ ఆటతీరు కనబర్చిన వారు కూడా కనీస ధరకు అమ్ముడు పోలేదు.
ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ని ఆధారంగా ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఫ్రాంఛైజీలు.. చాలా మంది స్టార్ ఆటగాళ్లను పట్టించుకోలేదు.. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. వారి కోసం 10 ఫ్రాంఛైజీలు రూ.550 కోట్లని ఖర్చు చేశాయి.అయితే ఈసారి మెగా వేలంలో బాంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్, కేకేఆర్ మాజీ ఆటగాడు షకీబ్ అల్ హసన్ మెగా వేలంలో అన్సోల్డ్గా పోవడంపై అతడి సతీమణి ఉమ్మే అహ్మద్ శిశిర్ తాజాగా స్పందించారు.
ఐపీఎల్ 15వ సీజన్ మెగా వేలానికి ముందు టోర్నీలో పలు షకీబ్ అల్ హసన్ ను కాంటాక్ట్ చేశాయని కానీ శ్రీలంకతో సిరీస్ కారణంగా సీజన్ మొత్తానికి షకీబ్ అందుబాటులో ఉండనని , చెప్పాడని, ఈ కారణంగానే అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదని అహ్మద్ శిశిర్ చెప్పుకొచ్చారు.. అలాగే ఒకవేళ షకీబ్ ఐపీఎల్ ఆడాలనుకుంటే శ్రీలంక సిరీస్ నుంచి తప్పుకునైనా అందులో ఆడేవాడని , కాని అతను ఐపీఎల్ కంటే దేశానికి ఆడటాన్నే గౌరవంగా భావిస్తాడని అహ్మద్ శిశిర్ చెప్పుకొచ్చింది..ఇదిలాఉంటే విదేశీ ఆల్రౌండర్ల కోసం ఐపీఎల్ మెగా వేలంలో రూ.కోట్లు కుమ్మరించిన ఫ్రాంఛైజీలు.. షకీబ్ అల్ హసన్ రూ.2 కోట్లకే అందుబాటులో ఉన్నా పట్టించుకోలేదు.
Shakib Al Hasan's wife Sakib Ummey Al Hasan issues a statement after he went unsold in IPL 2022 mega auction.
📸: @Sah75official #IPL2022 #ShakibAlHasan pic.twitter.com/RWOqrEDTRr
— CricTracker (@Cricketracker) February 14, 2022
Related News
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ తుది జట్టు ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును బీసీబీ ప్రకటించింది. బంగ్లాదేశ్ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్గా వ్యవహరించగా, షకీబ్ అల్ హసన్ తిరిగి వచ్చాడు. స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తిరిగి జట్టులోకి రావడంతో ఆ జట్టు బలంగా తయారైంది.