Krishna Vrinda Vihari: నాగశౌర్య, షిర్లీ సెటియాల కెమిస్ట్రీ అదుర్స్!
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో నిర్మాత ఉషా నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.
- By Balu J Published Date - 10:12 PM, Wed - 4 May 22
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం సమ్మర్ రేసులో మే20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ ‘వర్షంలో వెన్నెల’ మెలోడి హిట్ గా నిలిచింది. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మెలోడి మళ్ళీమళ్ళీ పాడుకునేలా వుండటంతో పాటు నాగశౌర్య, షిర్లీ సెటియాల కెమిస్ట్రీ చూడముచ్చటగా అలరించింది.
ఈ చిత్రం నుంచి రెండో పాట ”ఏముంది రా” లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. గాయకుడు హరిచరణ్ పాడిన ఈ పాటని ఇన్ స్టంట్ గా హిట్ అయ్యేలా కంపోజ్ చేశారు మహతి స్వర సాగర్. ప్లజంట్ ఇన్స్ట్రుమెంటేషన్తో వినడానికి హాయిగా అనిపిస్తున్న ఈ పాటకి అంతే చక్కని సాహిత్యం అందించారు హర్ష. లిరికల్ వీడియోలో చూపించిన విజివల్స్ కూడా బ్యూటీఫుల్ గా వున్నాయి. పాటలో నాగశౌర్య, షిర్లీని ఆగ్రహారానికి తీసుకురావడం, ఆమె సాంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించడం, హల్దీ ఫంక్షన్ మొదలుకొని పెళ్లి, సీమంతం, పిల్లలు..ఇలా హ్యాపీ మూమెంట్స్ ని పాటలో చూపించారు.
డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
Related News
Tollywood: ‘సితార’ సినిమాకు 40 వసంతాలు.. తెలుగు చలన చిత్రాల్లో ఓ కల్ట్ క్లాసిక్!
Tollywood: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన కళాత్మక కావ్యం సితార’. ఏప్రిల్ 27, 1984న విడుదలైన ఈ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. పూర్ణోదయా చిత్రాలైన ‘తాయారమ్మ-బంగారయ్య’, ‘శంకరాభరణం’, ’సీతాకోకచిలక’చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన వంశీలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద నాగేశ్వరరావు, వంశీకి ఈ అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన ‘మహల్లో క�