Road Accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బ్రిడ్జ్పోర్ట్ యూనివర్సిటీలో చదువుతున్న
- By Prasad Published Date - 08:00 AM, Mon - 5 June 23
అమెరికాలోని న్యూజెర్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బ్రిడ్జ్పోర్ట్ యూనివర్సిటీలో చదువుతున్న నిజామాబాద్కు చెందిన 23 ఏళ్ల విద్యార్థి గుర్రపు శైలేష్ ప్రాణాలు కోల్పోయాడు. శైలేష్ ప్రయాణిస్తున్న వాహనం యుటిలిటీ పోల్ను ఢీకొట్టి మంటలు అంటుకోవడంతో ఈ ఘటన జరిగింది. అదే కారు మరో కారును ఢీకొట్టడంతో పాటు రెండో కారు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. తక్షణమే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, శైలేష్ తీవ్రంగా కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. నిజమాబాద్ జిల్లాలోని బడా భీమ్గల్ గ్రామానికి చెందిన శైలేష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. శైలేష్ మరణంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శైలేష్ మృతదేహాన్ని నిజామాబాద్కు తీసుకురావడానికి కుటుంబసభ్యులు అధికారులను ఆశ్రయిస్తున్నారు. యుఎస్లోని అతని స్నేహితులు అతని కుటుంబానికి మద్దతుగా GoFundMe ప్రచారాన్ని ప్రారంభించారు.
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.