Road Accident : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. మినీ ట్రక్కు బోల్తా.. ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తా పడింది.
- Author : Prasad
Date : 04-01-2023 - 7:09 IST
Published By : Hashtagu Telugu Desk
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు. వాహనం చమతి గ్రామం నుండి బుర్హాన్పూర్ పట్టణానికి వెళ్తుండగా చౌడా నాలా సమీపంలో తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మినీ-ట్రక్కులో ఉన్న ఏడుగురు వ్యక్తులు గాయపడగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. వాహనం డ్రైవర్ చికిత్స పొందుతూ మరణించాడు. గాయపడిన నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు నింబోలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ హన్సరాజ్ కుమార్ తెలిపారు.