Road Accident : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. మినీ ట్రక్కు బోల్తా.. ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తా పడింది.
- By Prasad Published Date - 07:09 AM, Wed - 4 January 23
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు. వాహనం చమతి గ్రామం నుండి బుర్హాన్పూర్ పట్టణానికి వెళ్తుండగా చౌడా నాలా సమీపంలో తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మినీ-ట్రక్కులో ఉన్న ఏడుగురు వ్యక్తులు గాయపడగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. వాహనం డ్రైవర్ చికిత్స పొందుతూ మరణించాడు. గాయపడిన నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు నింబోలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ హన్సరాజ్ కుమార్ తెలిపారు.
Related News
Borewell : బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Boy Fell In Borewell In MP : మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) రేవా జిల్లా(Rewa District)లో ఆరేండ్ల బాలుడు(6 year old boy) బోరు బావిBorewell)లో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని రేవా జిల్లా మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలుడు ఓపెన్ బోర్వెల్ దగ్గర ఆడుకుంటుండగా హఠాత్తుగా దాంట్లో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధ�