Road Accident In Kavali : కావలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు ప్రమాదం జరిగింది....
- By Prasad Published Date - 10:00 PM, Sun - 18 September 22
నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి సమీపంలోని అలిగుంటపాలెం క్రాస్రోడ్ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం కారు నెల్లూరు నుంచి ఒంగోలుకు వస్తుండగా డివైడర్ను ఢీకొని పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Related News
Naveen Polishetty: హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. రెండు నెలలు సినిమాలకు దూరం..?
'జాతి రత్నాలు' స్టార్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)కి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఇది చిన్న ప్రమాదమే అని తెలుస్తోంది.