5 Killed : జమ్ము కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి
- By Prasad Published Date - 09:06 AM, Sat - 21 January 23
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కతువాలోని బిల్లావర్ ప్రాంతంలోని సిలా గ్రామం వద్ద మినీ బస్సు డ్రైవర్ అదుపు తప్పి ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. మినీ-బస్సు లోయలో పడిపోవడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇందులో గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మరణించాడని.. బస్సు మోండ్లీ నుండి ధను పరోల్ గ్రామానికి వెళ్తోందని పోలీసులు తెలిపారు.
Related News
Rajnath Singh: పీఓకే మనదే.. బలవంతం అవసరం లేదు: రాజ్ నాథ్ సింగ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ భారతదేశం తన భూమిని ఎప్పటికీ వదులుకోదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేని బలవంతంగా ఆధీనంలోకి తీసుకోవలసిన అవసరం లేదని, ఎందుకంటే కాశ్మీర్లో అభివృద్ధిని చూసి ప్రజలు స్వతహాగానే భారతదేశంలోకి రావాలని కోరుకుంటారని చెప్పారు.