Uttarkhand: తప్పతాగి వేగంగా బస్ నడుపుతూ పడిపోయిన డ్రైవర్.. చివరికి అలా?
తాజాగా ఉత్తరాఖాండ్ లో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది. దాంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. ఒక బస్సు డ్రైవర్ చేసిన ప
- By Nakshatra Published Date - 05:30 PM, Tue - 20 June 23
తాజాగా ఉత్తరాఖాండ్ లో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది. దాంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. ఒక బస్సు డ్రైవర్ చేసిన పనికి ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీకి హల్ద్వాని డిపోకి వెళ్తున్న బస్సులో డ్రైవర్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. ఆ సమయంలో బస్సు అడవిలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. బస్సు డ్రైవర్ spr తప్పి పడిపోవడంతో బస్సు అదుపుతప్పి అటు ఇటు వెళ్తుండగా ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.
ఇంతలోనే ఆ సమయంలో బస్సులోనే ఉన్న సిఐఎస్ఎఫ్ అధికారి ప్రాణాలకు తెగించి డ్రైవర్ను పక్కకు తో చేసి మరీ బస్సును ఆపి అందరి ప్రాణాలు కాపాడాడు. తాజాగా హల్ద్వానీ నుండి బయలుదేరిన బస్సు తర్వాత రుద్రాపూర్ ముందు తాండ అటవీ ప్రాంతంలో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన బస్సు నెంబర్ UK04PA1928 హల్ద్వానీ నుండి ఢిల్లీకి బయలుదేరింది. బస్సులో దాదాపుగా 55 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. డిపో నుంచి బయలుదేరిన తర్వాత డ్రైవర్ హల్ద్వానీ లోనే ఒకచోట బస్సును ఆపి డ్రైవర్ ఏదో తిన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.
ఆ తర్వాత బస్సులో రుద్రపూర్ వైపు ప్రయాణించాడని, తాండా అడవుల్లోకి బస్సు చేరుకోగానే డ్రైవర్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయి యాక్సిడెంట్ పై కాలు పెట్టడంతో బస్సు వేగం గంటకు వంద కిలోమీటర్లు పెరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. స్టీరింగ్ పై పడి ఉన్న డ్రైవర్ ని చూసి ప్రయాణికుల్లో భయం వ్యాపించి కేకలు వేయడంతో లోనే ఉన్న ఢిల్లీ లో మురారి కి చెందిన సిఐఎస్ఎఫ్ ఎస్సై సోను శర్మ తన భార్య పిల్లలను అత్తమామల ఇంట్లో వదిలి తిరిగి వెళుతున్నాడు. బస్సులో ప్రయాణికులు ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో సోను ధైర్యం చేసి డ్రైవర్ సీట్ దగ్గరికి చేరుకొని కొంతమంది సహాయంతో డ్రైవర్ ను పక్కకు తొలగించి తర్వాత సోను శర్మ స్టీరింగ్ హ్యాండిల్ చేస్తూ బస్సును రోడ్డుకు ఒక వైపుకు ఆపాడు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసు అధికారులు అక్కడికి చేరుకునే డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు గంట తర్వాత మరో బస్సులో ప్రయాణికులను ఢిల్లీకి పంపించారు.
Tags
Related News
Char Dham: చార్ధామ్ యాత్ర.. 2 రోజుల్లో ఐదుగురు భక్తులు మృతి
చార్ధామ్ యాత్ర ప్రారంభమై 2 రోజులైంది. కేదార్నాథ్ ధామ్ తలుపులు మే 10వ తేదీ అక్షయ తృతీయ రోజున తెరుచుకున్నాయి.