Kerala: కేరళలో భయభ్రాంతులకు గురి చేస్తున్న మరో వ్యాధి.. లక్షణాలు ఇవే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాధులు చాలా ఉన్నట్లు కొత్త కొత్త అరుదైన వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాలంలో
- By Nakshatra Published Date - 05:20 PM, Fri - 7 July 23
ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాధులు చాలా ఉన్నట్లు కొత్త కొత్త అరుదైన వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలా అరుదైన వ్యాధులు ఎక్కువగా వెలుగులోకి వస్తూ మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఈ అరుదైన వ్యాధులను వాటి లక్షణాలు మందులను కనుక్కోవడానికి తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేరళలో మరొక అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. కేరళలోని తీర ప్రాంతంలో ఉన్న అలప్పుజా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ వ్యాధిని గుర్తించారు.
ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే పేరు గల ఈ వ్యాధి కారకాన్ని ఒక 15 ఏళ్ల బాలుడు శరీరంలో గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అయితే కలుషిత నీటిలో స్వేచ్చగా జీవించే అమీబా కారణంగా ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు వెల్లడించారు. కాగా స్థానికంగా పనవల్లీ ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. తలనొప్పి, వాంతులు, మూర్చ వంటి ఇతర లక్షణాలు రోగిలో గమనించిన వైద్యులు షాంపుల్స్ను ల్యాబ్కు పంపించారు. దీంతో అమీబా కారణంగా సోకే అరుదైన వ్యాధి కారకం అతనిలో ఉన్నట్లు గుర్తించారు.
చికిత్సను ప్రారంభించామని తెలిపారు. రోగి శరీరంలోకి ముక్కు ద్వారా వ్యాధి కారకం ప్రవేశిస్తుందని వైద్యులు వెల్లడించారు. అటువంటి వ్యాధి సోకినప్పుడు కలుషిత నీటితో స్నానం చేయకూడదని తెలిపారు. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన అనంతరం మానవ శరీరంలోని మెదడుపై దాడి చేస్తుందని వెల్లడించారు. తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చకు సంబంధించిన లక్షణాలు ఉంటాయని తెలిపారు. 2017లో ఇదే ప్రాంతంలో ఇలాంటి బ్యాక్టీరియా కేసు నమోదైనట్లు వైద్యులు స్పష్టం చేశారు.
Related News
Durga Temple: ఈ దుర్గా మాత ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తారట..! ఆ టెంపుల్ విశేషాలివే..!
దుర్గా మాత (Durga Temple) పురాతన ఆలయం కేరళలోని మలప్పురంలో ఉన్న ముత్తువల్లపర్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తుంటారు.