Road Accident : కాలేజీ బస్సును ఢీ కొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం
ప్రకాశం జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యన్ ఇ సి కాలేజీ బస్సును....
- By Prasad Published Date - 11:52 AM, Fri - 16 September 22
ప్రకాశం జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యన్ ఇ సి కాలేజీ బస్సును లారీ ఢీకొట్టింది. వినుకొండ నుంచి నరసరావుపేట ఇంజనీరింగ్ (NEC) కాలేజీ కి విద్యార్ధులతో బస్సు వెళ్తుంది. బస్ లో సుమారు 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.వీరిలో కొంతమందికి గాయలైయ్యాయి. గాయాలైన విద్యార్థులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అద్దంకి నుండి పిడుగురాళ్ల వైపు వెళ్తున్న లారీ అతివేగంతో రావడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. లారీ డ్రైవర్ ను సంతమాగులూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Related News
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.