Radhe Shyam: ఉగాది కానుకగా.. ఓటీటీలో రాధేశ్యామ్..?
- By HashtagU Desk Published Date - 11:55 AM, Tue - 15 March 22
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. తొలిరోజే రాధే శ్యామ్ మూవీపై మిక్స్డ్ టాక్ వచ్చినా, మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 151 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. మాజ్ ఇమేజ్ ఉన్న ప్రభాస్కు రొమాంటిక్ మూవీస్ సెట్ కావని, ప్రభాస్ అమిమానులు సైతం తేల్చేశారు.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ మధ్య థియేటర్స్లో విడుదలైన నెలకే, ప్రతి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. దీంతో ఇప్పుడు రాధే శ్యామ్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మార్చి 11న విడుదలైన రాధే శ్యామ్, లెక్క ప్రకారం ఏప్రిల్ 11న ఓటీటీలో విడుదల అవ్వాలి. అయితే ఏప్రిల్ 2వ తేదిన ఉగాది కానుకగా సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో రాధే శ్యామ్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్, ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో చర్చలు సఫలమైతే ఏప్రిల్ 2న రాధే శ్యామ్ ఓటీటీలోకి రావడం ఖాయమని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.
Related News
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. సలార్ 2 షూటింగ్ అప్డేట్..
ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్. ప్రశాంత్ నీల్ సలార్ 2 షూటింగ్ని..