Punjab: ప్రధాని ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తా.. సీఎం
- Author : hashtagu
Date : 06-01-2022 - 6:03 IST
Published By : Hashtagu Telugu Desk
పంజాబ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎటువంటి ప్రమాదం లేదని.. ఒకవేళ ఏదైనా హాని ఉంటె నా ప్రాణాలు పణంగా పెట్టి ప్రధాన మంత్రిని కాపాడుతానని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చెన్ని అన్నారు. అనుకోని కారణాలవల్ల ప్రధాని భద్రతా విషయం లో లోపాలు తలెత్తాయి అప్పటికి ప్రధాని భద్రతకు భారీ స్థాయిలో బలగాలను మోహరించామని ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని అయన కోరారు. బుధవారం నిరసన చేపడుతున్న రైతులు ఆదుకోవడంతో 20నిమిషాల పటు ప్రధాని కాన్వాయ్ ను నిలిపివేశిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ ఘటనకు రాజకీయ రంగును పులుముతున్నారు.