Kamala Pujari Died: పద్మశ్రీ కమల పూజారి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
కల్మ పూజారి గుండెపోటుతో మరణించింది. 74 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించినందుకు మరియు 100 కంటే ఎక్కువ రకాల దేశీయ విత్తనాలను పరిరక్షించినందుకు ఆమెకు 2019 లో పద్మశ్రీ అవార్డు లభించింది.
- By Praveen Aluthuru Published Date - 05:21 PM, Sat - 20 July 24

Kamala Pujari Died: పద్మశ్రీ అవార్డు గ్రహీత కమల పూజారి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. కమలా పూజారి మృతి పట్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రధాని మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి మరియు గిరిజన సముదాయాల సాధికారత కోసం ఆమె చేసిన కృషి రాబోయే సంవత్సరాల్లో గుర్తుండి పోతుందన్నారు.
కల్మ పూజారి గుండెపోటుతో మరణించింది. 74 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించినందుకు మరియు 100 కంటే ఎక్కువ రకాల దేశీయ విత్తనాలను పరిరక్షించినందుకు ఆమెకు 2019 లో పద్మశ్రీ అవార్డు లభించింది.
కమల పూజారి గురించి ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో ఒక పోస్ట్ చేశారు. ‘శ్రీమతి కమల పూజారి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు మరియు దేశీయ విత్తనాలను రక్షించడంలో ఆమె గణనీయమైన కృషి చేశారు. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో ఆమె చేసిన కృషి ఏళ్ల తరబడి గుర్తుండిపోతుంది. గిరిజన సముదాయాలకు సాధికారత కల్పించడంలో కూడా ఆమె ఓ వెలుగు వెలిగారు. ఆమె కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. ఓం శాంతి అంటూ ముగించారు మోడీ.
Also Read: CI Harassment : పిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై CI లైంగిక వేధింపులు