Hyderabad: హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి, డబ్బులు స్వాధీనం
- By Balu J Published Date - 08:02 PM, Sat - 27 April 24
Hyderabad: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు గంజాయి అక్రమ రవాణా ను నియంత్రించేందుకు మల్టీ జోన్ 1 పరిధిలో 16 జిల్లాల్లో పోలీసులు, ప్రధాన రోడ్డు మార్గాల్లో వాహన తనిఖీలతో పాటు రైళ్ళల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అక్రమ గంజాయి కట్టడి చేయాలనే లక్ష్యంగా మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు మల్టీ జోన్ 1 పరిధిలోని 16జిల్లాల్లో పోలీస్ అధికారులు, ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు.
మల్టీ జోన్ 1 పరిధిలో చేపట్టిన పోలీసుల తనిఖీల్లో డబ్బుతో పాటు, మద్యం, గంజాయి భారీగా పట్టుబడింది. ఈ తనిఖీల్లో సుమారు 2,81,36,128/- రూపాయల నగదు, 4,05,823/- రూపాయల విలువగల మద్యం సీసాలు, 3,15,788/- రూపాయల విలువలైన 15.479 కిలోగ్రామ్స్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు 15 కేసులు నమోదు చేసి గంజాయిని అక్రంగా తలిస్తున్న 25 వ్యక్తులతో పాటు, 8 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Related News
Hyderabad: పోలీసుల ముమ్మర తనిఖీలు.. భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత
Hyderabad: ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యం, ఇతర వస్తువులను సైబరాబాద్ ఎస్ వోటీ బృందాలు పట్టుకున్నాయి. రూ.10,60,000 విలువ చేసే 53 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 35 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న జీజే 25 యూ 9238 లారీని ఎస్ వోటీ శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు.