HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Papatapalli John Padu Railway Line Should Be Cancelled Brs Mp Requested To Central Minister

BRS MP: పాపటపల్లి – జాన్ పాడు రైల్వే లైన్ రద్దు చేయాలి!

  • By Balu J Published Date - 12:35 AM, Sat - 10 February 24
  • daily-hunt
Vaddiraju
Vaddiraju

BRS MP: ఖమ్మం శివారు పాపటపల్లి నుంచి సూర్యాపేట జిల్లా జాన్ పాడు వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ తక్షణమే రద్దు చేయాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈ మార్గంలో లైన్ నిర్మాణం వల్ల రైతులు తమ విలువైన పంట పొలాలు నష్టపోతున్నారని, ప్రత్యామ్నాయ మార్గంలో సర్వే చేయాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో.. బాధిత రైతు ప్రతినిధులు వల్లూరి పట్టాబి, బానోత్ చంద్రావతి, గుర్రం రాము కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రతిపాదిత రైల్వే లైన్ మార్గంలో ఎక్కువగా దళిత, గిరిజన, పేద రైతులు ఎక్కువ మంది ఉన్నారని.. వీరికి సాగు భూమి తప్ప.. మరే ఇతర వనరులు లేవని.. భూములు కోల్పోతే రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని బాధిత రైతు ప్రతినిధులు.. రైల్వే మంత్రి కి మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర.. ప్రతిపాదిత లైన్ కు ప్రత్యామ్నాయంగా మరో మూడు మార్గాలను రైల్వే మంత్రి కి సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను కచ్చితంగా పరిశీలించి.. రైతులకు నష్టం జరగకుండా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వే పనులను సైతం నిలుపుదల చేసేలా తక్షణమే ఆదేశాలు ఇస్తానని రైల్వే మంత్రి హామి ఇచ్చారు.

గార్ల రైల్వే స్టేషన్ లో నెలకొన్న పలు సమస్యలపై ఎంపీ రవిచంద్ర కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న ప్లాట్ ఫాం లను విస్తరించాలని, స్టేషన్ లో డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, శాతవాహన, ఇంటర్ సిటీ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. వీటిపై కూడా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS MP
  • central minister
  • Trs mp vaddiraju

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd