AI Technology: ఉద్యోగులను టార్గెట్ చేసిన ఏఐ టెక్నాలజీ.. మే నెలలో ఏకంగా అన్ని వేల మందిని తొలగింపు?
ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థలు ఖర్చులను తగ్గించుకోవాలి అన్న ఉద్దేశంతో ఇప్పటికే వ
- By Nakshatra Published Date - 09:08 PM, Sun - 4 June 23
ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థలు ఖర్చులను తగ్గించుకోవాలి అన్న ఉద్దేశంతో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఉద్యోగులకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టార్గెట్ చేసింది. ఏఐ టెక్నాలజీ వల్ల టెక్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 4,000 మంది ఉద్యోగులను మే నెలలో తొలగించారు. వీరితోపాటు వివిధ కారణాల వల్ల దాదాపు 80,000 మందిని తొలగించారు.
మొత్తంగా చూసుకుంటే గత రెండు నెలలుగా టెక్ జాబ్ మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. చాట్ జీపీటీ, బింగ్, బార్డ్ వంటి ఏఐ టెక్నాలజీ వంటివి టెక్ ఉద్యోగులకు తలనొప్పిగా మారిపోయాయి. OpenAI నవంబర్ 2022 లో chatgpt ని పరిచయం చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లు తమ కొత్త ఏఐ టూల్స్ బింగ్, బార్డ్ వంటి వాటిని ఫిబ్రవరి లో ప్రారంభించాయి. కాగా ఈ మూడు ఏ ఐ టూల్స్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కొన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పనిచేస్తున్నాయి. గత నెలలో 80,000 మంది ఉద్యోగులను తొలగించగా అందులో ఏఐ ద్వారా దాదాపు నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఆ విధంగా ఈ ఏడాది ఆరంభం జనవరి నుంచి మే నెల వరకు దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు.
Related News
Sundar Pichai : టాప్ టెక్ జాబ్స్ కోసం ‘త్రీ ఇడియట్స్’ ఫార్ములా : సుందర్ పిచాయ్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ఒక లెజెండ్. సామాన్య కుటుంబం నుంచి దిగ్గజ కంపెనీ సీఈఓ స్థాయికి ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.