Nanded Train Fire Accident: నాందేడ్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. బోగీ దగ్ధం
నాందేడ్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వే స్టేషన్లో పూర్ణ-పర్లి ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి.
- By Praveen Aluthuru Published Date - 06:15 PM, Tue - 26 December 23
Nanded Train Fire Accident: నాందేడ్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వే స్టేషన్లో పూర్ణ-పర్లి ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. లగేజ్ కమ్ గ్వార్ వ్యాన్ కోచ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు అరగంటపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ఘటన తర్వాత కోచ్ను రైల్వే నుంచి తొలగించారు. రైల్వే స్టేషన్లో మరమ్మతుల కోసం ఉంచిన రైలు కోచ్లో ఈ మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో బోగీలోని లగేజ్, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
#WATCH | Fire broke out in an empty luggage-cum-guar van coach stationed in the Nanded maintenance Yard today. The fire was completely brought under control within 30 minutes of the incident and there was no damage to any other coaches: CPRO South Central Railways #Maharashtra pic.twitter.com/m7xRK3eqpZ
— ANI (@ANI) December 26, 2023
Also Read: Nellore YSRCP : మాజీ మంత్రి అనిల్కు స్థానచలనం.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ..?
Related News
Smoke In Train Toilet: రైలు టాయిలెట్లో అసాంఘిక కార్యకలాపాలు
భారతీయ రైలులో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఇటీవలి కాలంలో రిజర్వేషన్ కోచ్ లలో ఇతరులు ఏక్కి ఇబ్బందులు సృష్టించడం వెలుగు చూసింది. మరికొన్ని చోట్ల అయితే తోటి ప్రయాణికులు ఉన్నారన్న సోయి మరిచి ముద్దులతో రెచ్చిపోయిన ఘటనలు వెలుగు చూశాయి.