Mukesh Ambani Daughter: కవలలకు జన్మనిచ్చిన అంబానీ కూతురు.. పేర్లు కూడా పెట్టేశారు..!
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూతురు ఈశా అంబానీ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.
- Author : Gopi
Date : 20-11-2022 - 4:19 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూతురు ఈశా అంబానీ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. 2018లో ఆనంద్ పిరమల్ను పెళ్లాడిన ఈశా ఒక బాబు, పాపకు జన్మనిచ్చింది. పాపకు ఆదియా, బాబుకు కృష్ణ అని అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
అంబానీ కుమార్తె ఇషా అంబానీ నవంబర్ 19న కవలలకు జన్మనిచ్చింది. ఇషా పారిశ్రామికవేత్తలు అజయ్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్ను వివాహం చేసుకుంది. ఇషాకు ఓ కూతురు, కొడుకు పుట్టాడు. ఇషా, ఆనంద్ నవంబర్ 19, 2022న కవలలకు జన్మనిచ్చారని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఇషా, పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. కూతురు పేరు ఆదియా, కొడుకు పేరు కృష్ణ అని అంబానీ, పిరమల్ కుటుంబీకులు మీడియా ప్రకటనలో తెలిపారు. ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ డిసెంబర్ 2018లో వివాహం చేసుకున్నారు. ఇషా ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త ఆనంద్ పిరమల్ పిరమల్ గ్రూప్ ఆర్థిక సేవల వ్యాపారాన్ని చూసుకుంటున్నారు.