Andhra Pradesh: అధ్వానంగా ఉన్న రోడ్డులో టోల్ చార్జీలు సరికాదు- రోజా
- By hashtagu Published Date - 03:19 PM, Fri - 7 January 22
చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఇవాళ ఆమె విజయవాడలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబును కలిశారు. నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని అటువంటి రోడ్డులో టోల్ చార్జీలు వసూలు చేయడం సరికాదని రోజా అన్నారు.
తన నగరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారికీ వెంటనే మరమ్మతులు చేపట్టాలని కూడా ఆమె కోరారు. ఈ మేరకు కృష్ణబాబుకు ఎమ్మెల్యే రోజా వినతిపత్రం అందజేశారు
Related News
Minister Roja Properties : ఐదేళ్లలో మంత్రి రోజా ఆస్తులు ఎంత పెరిగాయో తెలుసా..?
2019లో ఆమె ఆస్తులు రూ.9.03 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.13.07 కోట్లకు పెరిగింది