HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Mizoram Election Results 2023

Mizoram election results: కొనసాగుతోన్న మిజోరాం ఎన్నికల కౌంటింగ్.. కాసేపట్లో ఫలితాలు

మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికార మిజో నేషనల్​ ఫ్రెంట్​- జోరం పీపుల్స్​ మూవ్​మెంట్​ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఈ రెండు కూడా ప్రాంతీయ పార్టీలే కావడం విశేషం.

  • By Praveen Aluthuru Published Date - 12:20 PM, Mon - 4 December 23
  • daily-hunt
Mizoram Election Results 2023
Mizoram Election Results 2023

Mizoram election results: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికార మిజో నేషనల్​ ఫ్రెంట్​- జోరం పీపుల్స్​ మూవ్​మెంట్​ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఈ రెండు కూడా ప్రాంతీయ పార్టీలే కావడం విశేషం.

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఆదివారం ప్రార్థనల కోసం చర్చిలకు వెళ్లాల్సి ఉన్నందున ఓట్ల లెక్కింపును మార్చాలని మిజోరం ప్రజలు డిమాండ్ చేశారు.ఈరోజు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఉదయం 10.45 గంటల సమయానికి జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే విధంగా అధికార మిజో నేషనల్ ఫ్రంట్ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు నిన్న ఓట్ల లెక్కింపు పూర్తయింది. దాని ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీని ఓడించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ అఖండ మెజారిటీతో గెలుపొందింది.

ఈ రోజు డిసెంబర్ 4 మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 40 సీట్లున్న మిజోరం రాష్ట్రంలో అధికార మిజో నేషనల్ పార్టీ, కాంగ్రెస్, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇందుకోసం 13 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందుగా ఉదయం 8.30 గంటలకు పోస్టల్‌ ఓట్ల ఫలితాలను వెల్లడిస్తారు. అనంతరం ఎలక్ట్రానిక్‌ మెషీన్‌లో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. 40 నియోజకవర్గాలు మాత్రమే ఉండడంతో మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

మిజోరంలో అధికారం చేపట్టాలంటే మొత్తం 40 నియోజకవర్గాల్లో 21 స్థానాల్లో గెలిస్తే చాలు. నిన్నటి ఓట్ల లెక్కింపు ప్రకారం రాజస్థాన్‌లోని 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది. ఇంతకు ముందు రాజస్థాన్ కాంగ్రెస్ చేతిలో ఉండేది. అలాగే కాంగ్రెస్ 69 నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. బార్త్ ఆదివాసీ పార్టీ 3 నియోజకవర్గాల్లో, బీఎస్పీ 2 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే.. మొత్తం 230 నియోజకవర్గాల్లో అధికార బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. భారత్ ఆదివాసీ పార్టీ ఒక స్థానంలో గెలిచింది.

Also Read: Toopran – Plane Crash : తూప్రాన్‌లో కూలిన హెలికాప్టర్.. ఇద్దరి సజీవ దహనం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • elections
  • Mizoram
  • results

Related News

    Latest News

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd