Loan App Harassment : లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి.. బోర్డుపై సూసైడ్ నోట్
నిజాంపేట్లో దారుణం జరిగింది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ...
- By Prasad Published Date - 07:45 AM, Tue - 27 September 22
నిజాంపేట్లో దారుణం జరిగింది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే.. రాజేష్ అనే వ్యక్తి తన ఇంట్లో ఎవరు లేని సమయంలో… తన చావు కారణం లోన్ యాప్ నిర్వాహకులు పెట్టే బాధలే నని బోర్డుపై సూసైడ్ నోట్ రాశాడు. తరువాత ఇంట్లో ఫ్యాన్ కుఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో తన భార్యకు సారీ చెప్తూ లోన్ యాప్ వాళ్లు తనకు అసభ్యకరమమైన ఫోటోలు పెట్టి వేధించారని ఇక తనకు బ్రతకాలని లేదని రాశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.