Pawars Game : మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంటే.. మీటింగ్ కు హాజరైన 35 మంది
Pawars Game : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని 54 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది.. ఎవరి వైపు ఉన్నారనే దానిపై క్లారిటీ వచ్చింది..
- By Pasha Published Date - 01:50 PM, Wed - 5 July 23
Pawars Game : ముంబైలో పొలిటికల్ హీట్ పెరిగింది.
అజిత్ పవార్, శరద్ పవార్ వేర్వేరుగా నిర్వహించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యేల మీటింగ్ ఉత్కంఠ రేపింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని 53 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది.. ఎవరి వైపు ఉన్నారనే దానిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది..
జాతీయ మీడియా కథనాల ప్రకారం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిక వర్గం మీటింగ్ కు 35 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
8 మంది ఎన్సీపీ ఎమ్మెల్సీల్లో ఐదుగురు కూడా అజిత్ పవార్ నిర్వహించిన మీటింగ్ కు అటెండ్ అయ్యారు.
ఇద్దరు ఎన్సీపీ ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే సైతం అజిత్ నాయకత్వానికి జై కొట్టారు..
మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నిర్వహించిన మీటింగ్ కు 17 మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారు.
దీంతో మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వైపే ఉన్నారని తేలిపోయింది. మూడింట రెండు వంతుల మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ఇక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు అజిత్ పవార్ కు వర్తించవు. ఎన్సీపీ ఎవరిది అనేది క్లెయిమ్ చేసుకోవడంపై అజిత్ పవార్ తదుపరిగా ఫోకస్ చేయనున్నారు.
ఇక అజిత్ పవార్ క్యాంపులో చేరిన నలుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ క్యాంపుకు చేరుకున్నారు. బుధవారం ముంబైలో శరద్ పవార్ నిర్వహించిన మీటింగ్ లో తిరుగుబాటు ఎమ్మెల్యేలు కిరణ్ లహమ్టే, రోహిత్ పవార్, దేవేంద్ర భుయార్, అశోక్ పవార్ కూడా పాల్గొనడం గమనార్హం. ఎన్సీపీ పార్టీ పేరు, గుర్తుపై హక్కు తమదే అని పేర్కొంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇప్పటికే ఎన్నికల సంఘంలో కేవియట్ పిటిషన్ వేశారు. ఈరోజు మీటింగ్ ద్వారా బల నిరూపణ చేసుకున్న తర్వాత ఎన్నికల సంఘంలో తాము కూడా పిటిషన్ వేస్తామని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం అంటోంది. ఎన్సీపీ పార్టీ పేరు, గుర్తుపై హక్కు తమదేనని.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న తమకే వాటిని కేటాయించాలని వాదిస్తున్నారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెబుతోంది ?
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. శాసనసభ్యులు తమ రాజకీయ పార్టీల నుంచి ఫిరాయించకుండా నిరోధించడానికి ఈ షెడ్యూల్ ను 1985లో ప్రవేశపెట్టారు. తమ పార్టీని స్వచ్ఛందంగా వదిలివేయడం లేదా పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా పార్టీ ఫిరాయించిన పార్లమెంటేరియన్లు లేదా శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే ప్రక్రియను ఈ షెడ్యూల్ వివరిస్తుంది.
ఫిరాయింపుల నిరోధక చట్టం ఎప్పుడు వర్తించదు?
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక శాసనసభ్యుడు ఓటింగ్కు దూరంగా ఉన్నా.. ఏదైనా సమస్యపై పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసినా వారి స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ చట్టం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండింటికీ వర్తిస్తుంది. ఈ చట్టం రెండు మినహాయింపులను అందిస్తుంది. అవేమిటంటే.. కొంతమంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఒక సమూహంగా ఏర్పడితే ఈ పరిణామాలను ఎదుర్కోకుండానే ఓటింగ్కు గైర్హాజరు కావచ్చు. ఒక రాజకీయ పార్టీకి చెందిన శాసనసభ్యులలో మూడింట ఒక వంతు మంది దాని నుంచి రాజీనామా చేస్తే లేదా మూడింట రెండు వంతుల మంది శాసనసభ్యులు మరొక పార్టీలో విలీనమైతే దాన్ని ఫిరాయింపుగా పరిగణించరు.
Tags
Related News
TDP : సతీసమేతంగా మహారాష్ట్రలో టీడీపీ అధినేత పర్యటన
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్శరి(Bhuvaneshari)తో కలిసి ఈరోజు మహారాష్ట్ర (Maharashtra)లోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని(Kolhapur Sri Mahalakshmi Temple) సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు, నారా భువనేశ్వరి షిరిడీ పయనమయ్యారు. అక్కడ సాయిన