Afternoon Naps:మధ్యాహ్నం కునుకుతో ఎన్నో ప్రయోజనాలు..!!
మధ్యాహ్నం నిద్రపోవాలంటే చాలామంది భయపడుతుంటారు. ముఖ్యంగా తిన్న తర్వాత వెంటనే కునుకు తీస్తే బరువు పెరగడంతోపాటు రాత్రిళ్లు నిద్రపట్టదని...
- By Hashtag U Published Date - 03:03 PM, Wed - 20 April 22

మధ్యాహ్నం నిద్రపోవాలంటే చాలామంది భయపడుతుంటారు. ముఖ్యంగా తిన్న తర్వాత వెంటనే కునుకు తీస్తే బరువు పెరగడంతోపాటు రాత్రిళ్లు నిద్రపట్టదని…ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయని చాలామంది అనుకుంటుంటారు. అయితే మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నోఅధ్యయనాలు జరిగాయి. మధ్యాహ్నం కునుకు మంచి ఫలితాలు ఇస్తుందని ఎక్కువ శాతం అధ్యయనాల్లో తేలింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు కునుకు తీసినట్లయితే…రిఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో మధ్యాహ్నం భోజనంతో బద్ధకం, అధికబరువు, రాత్రినిద్రకు ఆటంకం సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాలు చెప్పుతుండగా…అది నిజం కాదన్నది మెజార్టీ వైద్యులు అభిప్రాయం.
మధ్యాహ్నం భోజనం తర్వాత కలిగే ప్రయోజనాలు..
జీర్ణశక్తి…
మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవడం ద్వారా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆ సమయంలో శక్తి అంతా జీర్ణక్రియకు వినియోగించుకుంటుంది. దీంతో తీసుకున్న ఆహారం మెరుగ్గా జీర్ణం అవుతుంది. పోషకాలు శరీరం అంతటికీ చేరుతాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, మలబద్ధకం, చుండ్రు వంటి సమస్యలను కూడా నివారించుకోవచ్చు.
రాత్రి నిద్ర సరిగ్గా పట్టదనే భావన..
లంచ్ తర్వాత కునుకు తీయడం వల్ల రాత్రి నిద్ర ఆలస్యమవుతుందని సరిగ్గా నిద్ర పట్టదన్న అపోహ ఉంది. కానీ నిద్ర సమస్యలకు మధ్యాహ్నం నిద్రం కారణం కానే కాదు. రాత్రి వేళల క్రమబద్దంగా లేకపోకపోయినా..ఆలోచనలు ఎక్కువైనా..శారీరక కదలికలు తగినంత లేకపోయినా…ఒత్తిడి ఎదుర్కొంటున్నా నిద్ర సరిగ్గా పట్టదు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య 30 నిమిషాల పాటు నిద్రించినట్లయితే…సాయంత్రం సమయంలో మోస్తరు వ్యాయామం చేసిన వారికి రాత్రి చక్కటి నిద్ర పడుతున్నట్లు అధ్యయనాల్లో గుర్తించారు.
హార్మోన్లలో సమతుల్యత మెరుగు
హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నవారు మధ్యాహ్నం కొంత సమయం నిద్రించడం వల్ల వారి పరిస్థితి మెరుగుపడుతుంది. షుగర్, పీసీఓడి, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు లంచ్ తర్వాత కునుకు అలవాటు చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణుల సూచన
జ్ఞాపకశక్తి
జ్ఞాపకశక్తికి కూడా లంచ్ తర్వాత నిద్ర మేలు చేస్తుంది. మంచి మూడ్ కు సాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే లేదా కొద్ది సమయం తర్వాత ఎడమవైపునకు తిరిగి అర్థగంట పాటు నిద్రించడం సరైనది. నిద్ర రాకున్నా పర్వాలేదు. కళ్లు మూసుకుని పడుకుంటే…ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు.