Human Flesh: మహిళపై పలుమార్లు సామూహిక అత్యాచారం..మనిషి మాంసం వండించి తినిపించారు!
కాంగోలో మానవత్వం మంట కలుస్తోంది. ఉగ్రవాద సంస్థలు పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి.
- By Hashtag U Published Date - 05:45 AM, Fri - 1 July 22
కాంగోలో మానవత్వం మంట కలుస్తోంది. ఉగ్రవాద సంస్థలు పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. కోడెస్కో(CODECO) అనే కాంగో మిలిటెంట్ గ్రూప్ ఒక మహిళతో చేసిన దారుణమైన ప్రవర్తనపై ఇప్పుడు ప్రపంచమంతా హాట్ డిబేట్ జరుగుతోంది. ఈవిషయాన్ని “ఫిమేల్ సాలిడారిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ పీస్ అండ్ డెవలప్మెంట్” అనే స్వచ్ఛంద సంస్థ నేరుగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లింది.
కాంగో స్వచ్ఛంద సంస్థ కథనం ప్రకారం..
కాంగోలోని ఒక గ్రామానికి చెందిన ఓ కుటుంబాన్ని కోడెస్కో (CODECO) అనే మిలిటెంట్ గ్రూప్ కిడ్నాప్ చేసింది. వారిని విడిచి పెట్టాలంటే తాము చెప్పినంత డబ్బును ముట్టజెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ గ్రామం వాళ్ళు ఒక మహిళకు డబ్బులిచ్చి కోడెస్కో మిలిటెంట్ గ్రూప్ స్థావరానికి పంపారు. ఆ డబ్బును తీసుకున్న మిలిటెంట్ గ్రూప్ .. సొమ్మును తీసుకొచ్చిన మహిళను కూడా కిడ్నాప్ చేశారు. ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం కిడ్నాప్ అయి తమ చెరలో ఉన్న బందీల్లో ఒకరి గొంతుకోసి చంపారు. చనిపోయిన వ్యక్తి పొట్టలో నుంచి పేగులు తీసి వాటిని తెచ్చి మహిళ చేతిలో పెట్టారు. వాటితో భోజనం వండాలని మహిళను ఆదేశించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె మనిషి పేగులతో కూర వండింది. ఆ కూరను .. చెరలో ఉన్న ఇతర బందీలతో తినిపించారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత బాధిత మహిళను వదిలేశారు. ఆమె ఇంటికి తిరిగి వెళ్తుండగా.. దారి మధ్యలో మరో మిలిటెంట్ గ్రూప్ కిడ్నాప్ చేసింది. ఆ మిలిటెంట్ గ్రూప్ సభ్యులు కూడా పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వాళ్ళు కూడా ఓ వ్యక్తిని చంపి.. అతడి మాంసంతో కూర వండించారు. దాన్ని తినమని మహిళను బలవంతం చేశారు.
Related News
78 Year Imprisonment : ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్కు 78 ఏళ్ల జైలు
78 Year Imprisonment : 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక ప్రకటన చేసింది.