Khajuraho Express Fire: ఉదయ్పూర్-ఖజురహో ఎక్స్ప్రెస్లో మంటలు
ఉదయ్పూర్ నుంచి ఖజురహో వెళ్తున్న ఉదయ్పూర్-ఖజురహో ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన ఘటన వెలుగు చూసింది. గ్వాలియర్లోని సిథోలి స్టేషన్ సమీపంలో రైలు ఇంజన్లో మంటలు
- By Praveen Aluthuru Published Date - 03:30 PM, Sat - 19 August 23
Khajuraho Express Fire: ఉదయ్పూర్ నుంచి ఖజురహో వెళ్తున్న ఉదయ్పూర్-ఖజురహో ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన ఘటన వెలుగు చూసింది. గ్వాలియర్లోని సిథోలి స్టేషన్ సమీపంలో రైలు ఇంజన్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను గుర్తించిన వెంటనే లోకో పైలట్ సిథౌలీ సమీపంలో రైలును ఆపి కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఇంజన్లో మంటలు చెలరేగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
VIDEO | A fire broke out in the engine of Khajuraho Udaipur intercity train near Gwalior. More details are awaited. pic.twitter.com/BkvDVmZOYq
— Press Trust of India (@PTI_News) August 19, 2023
ఉదయపూర్ ఖజురహో ఎక్స్ప్రెస్ గ్వాలియర్ స్టేషన్కు కాస్త లేటుగా వచ్చింది. 12.14 నిమిషాలకు బదులుగా 12.35 నిమిషాలకు ఆలస్యంగా చేరుకుంది. దీని తర్వాత రైలు 12.45 గంటలకు ఝాన్సీకి బయలుదేరింది. గ్వాలియర్ స్టేషన్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిథోలి స్టేషన్కు చేరుకోగానే ఇంజిన్లో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెంటనే లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. అనంతరం కంట్రోల్ రూంకు సమాచారం అందించారు.
Also Read: MLA Vamsi Mohan : ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్కి ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
Related News
Shadnagar Fire: షాద్ నగర్ అగ్ని ప్రమాదంలో 50 మందిని తాడు సహాయంతో కాపాడిన బాలుడు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది సిబ్బంది చిక్కుకున్నారు. మంటలు భయంకరంగా ఎగసిపడుతుండగా బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.