Khairatabad : ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ కన్నుమూత
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ కన్నుమూశారు....
- By Prasad Published Date - 10:05 AM, Sat - 1 October 22
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో 1954లో ఖైరతాబాద్లో తొలిసారి ఒక అడుగు వినాయకుడిని ప్రతిష్టించారు. ఆ తర్వాత ఏటా ఒక్కో అడుగు పెంచుతూ 2014 నాటికి 60 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత శోభయాత్ర నిబంధనలతో వినాయకుడి ఎత్తును పెంచడం ఆపేశారు. గత నెలలో జరిగిన వినాయక ఉత్సవాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లును చేశారు. అయితే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సుదర్శన్ ఈ రోజు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Related News
Amit Shah ‘Deepfake’ Video Case: ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్తోపాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.