Kerala: కేరళలో విచిత్ర ఘటన.. కిలోమీటర్ వెనక్కి నడిచిన రైలు.. ఎందుకో తెలుసా?
మామూలుగా మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా ఏదైనా రైలు వస్తుంది అంటే ముందుగానే ఏదైనా ఒక స్టేషన్లో ఆ రైలు ని ఆపి ఎదురుగా వస్తున్న రైలు వ
- By Nakshatra Published Date - 07:48 PM, Mon - 22 May 23
మామూలుగా మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా ఏదైనా రైలు వస్తుంది అంటే ముందుగానే ఏదైనా ఒక స్టేషన్లో ఆ రైలు ని ఆపి ఎదురుగా వస్తున్న రైలు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ట్రైనింగ్ మూవ్ చేస్తూ ఉంటారు. అలాగే స్టేషన్ లో స్టాపింగ్ ఉంది అంటే తప్పకుండా ఆ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ని ఆపాల్సిందే. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే రైల్లు స్టేషను దాటి వెళ్లిపోవడం లేదంటే రైలు వెనక్కి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి.. రైలు వెనక్కి రావడం అన్నది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. తాజాగా మాత్రం కేరళలో ఒక ట్రైన్ ఒక కిలోమీటర్ మేర వెనక్కు నడిచింది.
తాజాగా కేరళ కేరళలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ లో ఆగాల్సిన రైలు ఆగకుండా ఆ ముందుకు వెళ్ళింది. ఆ విషయాన్ని కాస్త దూరంగా వెళ్ళిన తరువాత తెలుసుకున్న లోకో పైలెట్ దాదాపు కిలోమీటర్ మేరకు రైలును వెనక్కి నడిపాడు. ఈ వింత సంఘటన అలప్పుజ జిల్లాలో సోమవారం ఉదయం 7.45 గంటలకు చోటుచేసుకుంది. షోరనూర్ నుంచి వేనాడ్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు మావెలిక్కర, చెంగన్నూర్ మధ్యనున్న చెరియానాడ్ రైల్వే స్టేషన్లో ఆగాల్సి ఉంది. కానీ రైలు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. వెంటనే అటు స్టేషన్లో రైలు ఎక్కాల్సినవాళ్లు ఇటు రైలు నుంచి దిగాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందారు.
కాసేపటికి లోకో పైలట్కు వెనక స్టేషన్లో ప్రయాణికులు ఉన్న విషయం గుర్తొచ్చింది. దీంతో రైలును వెనక్కి నడిపాడు. 700 మీటర్లు రైలును వెనక్కిపోనిచ్చి స్టేషన్లో ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. కాగా ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రైల్వే అధికారులు తెలిపారు. అయినా రైలు సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకుందని వెల్లడించారు. అయితే చేర్యానాడ్ స్టేషన్లో సిగ్నల్ లేదా స్టేషన్ మాస్టర్ లేకపోవడంతో రైలు ఆగకుండా వెళ్లిపోయి ఉందని, ఇది లోకో పైలట్ని తప్పిదంగా అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతని నుంచి వివరణ కోరనున్నట్లు పేర్కొన్నారు. స్టేషన్లో ట్రైన్ ఆపకపోవడానికి కారణం ఏంటనే విషయంపై విచారిస్తామని తెలిపారు.
Related News
Durga Temple: ఈ దుర్గా మాత ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తారట..! ఆ టెంపుల్ విశేషాలివే..!
దుర్గా మాత (Durga Temple) పురాతన ఆలయం కేరళలోని మలప్పురంలో ఉన్న ముత్తువల్లపర్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తుంటారు.