HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Janasena Leader Nadendla Manohar Comments On Ycp Govt

Nadendla: ఫ్యాను గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్లు తిరగని పరిస్థితి వచ్చింది! 

ఫ్యాను గుర్తు చూసి ఓటేసిన ప్రజల ఇళ్లలో ఫ్యాన్లు తిరగని పరిస్థితి వచ్చిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

  • By Hashtag U Published Date - 09:11 PM, Wed - 30 March 22
  • daily-hunt
Manohar
Manohar

ఫ్యాను గుర్తు చూసి ఓటేసిన ప్రజల ఇళ్లలో ఫ్యాన్లు తిరగని పరిస్థితి వచ్చిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి భారీ ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచడాన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. సంక్షేమమనే గోబెల్ ప్రచారంతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని చెప్పారు. బుధవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన మనోహర్ కి రాజమండ్రి విమానాశ్రయంలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ… “మూడేళ్ల వైసీపీ పరిపాలనలో రాష్ట్రం ఆర్ధికంగా చితికిపోయింది. నిజాయితీతో కూడిన పరిపాలన అందించలేని పరిస్థితి. ఇప్పుడు వివిధ కేటగిరీలుగా ఉన్న విద్యుత్ కనెక్షన్ల ద్వారా గృహ అవసరాలకు ఉపయోగడే విధంగా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న సామాన్యుడిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది.

ఈ ప్రభుత్వ పాలన సామాన్యుడిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ప్రజల గురించి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఏ మాత్రం బాధగాని, ఆలోచనగాని లేదు. అంధకారంలో ఉన్న రాష్ట్ర ప్రజల్ని కాపాడాలనే బాధ్యత లేకపోవడం విచారకరం. పాదయాత్రలో నవరత్నాల పేరిట చేసిన ప్రచారంతో రాష్ట్రానికి నూటికి నూరుపాళ్లు నష్టం జరుగుతోంది. విద్యుత్ ఛార్జీల పేరిట ఫార్మల్ గా నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల మీద భారం మోపాలని చూస్తే సామాన్యుడితో పాటు జనసేన పార్టీ రోడ్డు మీదకు వచ్చి ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వం దిగి వచ్చేలా పోరాటం చేస్తుంది.

కొంత మందికే ఉపయోగపడేలా, సామాన్యుడిని ఇబ్బందిపెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఈ అంశం మీద బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా జనసేన పార్టీ ముందుకు వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు ప్రజలకు అర్ధం అయ్యేలా చేస్తాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే విధంగా ప్రజలతో కలసి ఆందోళనలు చేపడతాం. ఇప్పటికే ఆరు నెలల నుంచి రోజుకు ఆరు గంటల చొప్పున అనధికారిక కోతలు విధిస్తున్నారు. ఇప్పుడు అది కాస్త 8 గంటలకు చేరింద”న్నారు నాదెండ్ల మనోహర్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Janasena
  • Nadendla Manohar
  • power cuts

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • Nara Lokesh

    Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

  • Vijayawada-Bengaluru flight narrowly misses major danger

    Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం

Latest News

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd