Jalandhar Bypoll Result 2023: ఆప్ కు సవాలుగా మారిన జలంధర్ ఉప ఎన్నిక రిజల్ట్
జలంధర్ లోక్సభ ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
- By Praveen Aluthuru Published Date - 07:35 AM, Sat - 13 May 23

Jalandhar Bypoll Result 2023: జలంధర్ లోక్సభ ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. జలంధర్ లోక్ సభ ఉప ఎన్నికలో 19 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 16 లక్షల మంది ఓటర్లు తమ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మే 10న జలంధర్లో ఓటింగ్ జరిగింది. ఫలితం ఏదైనా కావచ్చు, అది అన్ని రాజకీయ పార్టీలపై ప్రభావం చూపుతుందంటున్నారు రాజకీయ నిపుణులు.
జలంధర్ లోక్ సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం కౌంటింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ను లెక్కించనున్నారు. ఎనిమిది గంటలకు ఈవీఎం తెరుచుకుంటుంది. ఉదయం 9 గంటలకు ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్, స్టేట్ పట్వార్ స్కూల్, కపుర్తలా రోడ్డులోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
జలంధర్ లోక్సభ ఉపఎన్నికలో సంతోఖ్ చౌదరి భార్య కరంజిత్ కౌర్ను కాంగ్రెస్, అకాలీ ఇందర్ ఇక్బాల్ అత్వాల్ను బిజెపి నిలబెట్టింది. ఎస్ఎడి-బిఎస్పి డాక్టర్ సుఖ్విందర్ కుమార్ సుఖీని, ఆప్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుశీల్ రింకూను ఈ స్థానంలో పోటీ చేయించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గత ఏడాది జరిగిన తొలి ఉప ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి అతిపెద్ద సవాలు ఎదురైంది. ఈ సందర్భంలో రెండవ ఉప ఎన్నిక ఆప్ కు అతిపెద్ద సవాలుగా మిగిలిపోయింది.
Read More: kiss cafe : కిస్ కేఫ్.. ఖేల్ ఖతం