Pm Modi: అదొక అవినీతి సమూహం, ప్రతిపక్షాల సమావేశంపై మోడీ విమర్శలు
ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశంపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.
- By Balu J Published Date - 04:22 PM, Tue - 18 July 23
Pm Modi: ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశంపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతలందరినీ.. ఒకే ఫ్రేమ్లో చూసి అవినీతి సమూహంగా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2024లో బీజేపీని మళ్లీ గెలిపించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని మోదీ చెప్పారు. పోర్ట్ బ్లెయిర్లోని వీరసావర్కార్ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వీర సావర్కార్ విగ్రహాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ఆవిష్కరించారు.
నూతన టెర్మినల్ వల్ల ప్రయాణం మరింత సులభతరంగా మారుతుందని ప్రధాని మోదీ తెలిపారు. అనుసంధానత పెరగడం వల్ల అండమాన్ -నికోబార్ దీవుల్లో పర్యాటకం అభివృద్ధి చెందుతుందని వివరించారు. అండమాన్ కు సబ్ మెరైన్ ఆప్టికల్ కేబుల్ ఫైబర్ తెస్తామని, పోర్ట్ బ్లెయిర్ లో వైద్యకళాశాలను నిర్మిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విపక్షాల సమావేశంపై విమర్శలు చేశారు.
గత 9 సంవత్సరాల కాలంలో పోర్టు బ్లెయిర్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసిందని తెలిపారు. ఇంటింటికీ తాగునీటిని అందించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. విధంగా పోర్టు బ్లెయిర్లో వైద్య కళాశాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. అండమాన్ ప్రాంతాన్ని పర్యాటకులకు అత్యంత చేరువ చేసేలా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య రెట్టింపు అవుతుందని తెలిపారు. పర్యటక కేంద్రాలను అభివృద్ధి చేయడంతోపాటు వసతి సౌకర్యాలను కూడా పెంచుతున్నామన్నారు.
Also Read: Prabhas Record: బాక్సాఫీస్ కింగ్ ఫ్రభాస్, 1979 స్క్రీన్లలో సలార్ రిలీజ్!
Related News
CM Revanth Reddy : ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళతో సఖ్యతగా ఉంటాం
నిన్నటి వరకు ఎన్నికల హడావిడిలో మునిగిపోయిన అధికార యంత్రాంగం ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మీడియా చిట్ చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.