IPL PLAYOFF: రాయల్స్ వెర్సెస్ కింగ్స్.. గెలుపెవరిదో ?
ఐపీఎల్-2022 సీజన్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు శనివారం మే7న తలపడనున్నాయి.
- By Naresh Kumar Published Date - 01:04 PM, Sat - 7 May 22
ఐపీఎల్-2022 సీజన్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు శనివారం మే7న తలపడనున్నాయి. సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు.. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. 10 మ్యాచ్లలో 6 విజయాలతో రాజస్థాన్ టీం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగతోంది. ఇక గత రెండు మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుతంగా రాణించనప్పటికీ.. బౌలర్లు మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. రాజస్థాన్ బ్యాటర్లలో జొస్ బట్లర్ , సంజు శాంసన్, శిమ్రాన్ హేట్మేయర్ ఫామ్లో ఉండటం ఆ జట్టుకు కలిసిచ్చే ఆంశం.
ఇక పంజాబ్ కింగ్స్ జట్టు తన చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ , బానుక రాజపక్స, లివింగ్ స్టోన్, బెయిర్ స్టో వంటి స్టార్ ఆటగాళ్లతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ పరంగా కాగిసో రబడా, రిషి ధావన్ అర్షదీప్ సింగ్ వంటి బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. కీలక మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకున్న పంజాబ్ మరో విజయాలు కోసం ఎదురు చూస్తోంది.
ఇక ఈ క్యాష్ రీచ్ లీగ్ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటి వరకు ముఖాముఖి 23 సార్లు తలపడగా.. రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్లలో విజయం సాధించగా.. పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్ జరగనున్న ముంబైలోని వాంఖడే పిచ్ పై కొన్ని సార్లు ఛేజింగ్ చేసిన జట్లు గెలుపొందగా.. మరికొన్ని మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ప్రస్తుత పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి జట్టు ఛేజింగ్వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.
Related News
Mumbai Win: ముంబై మళ్లీ గెలుపు బాట.. ఉత్కంఠ పోరులో పంజాబ్ పై విజయం
ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది.