T20: సిరీస్ పట్టేస్తారా ?
సొంత గడ్డ పై మరో సీరీస్ విజయంపై టీమ్ ఇండియా కన్నేసింది.
- By Hashtag U Published Date - 08:12 AM, Fri - 18 February 22
సొంత గడ్డ పై మరో సీరీస్ విజయంపై టీమ్ ఇండియా కన్నేసింది. విండీస్ తో తొలి టీ ట్వంటీలో అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన టీమిండియా ఇప్పుడు సిరీస్ గెలవడమే లక్ష్యంగా రెండో మ్యాచ్ కు సిద్ధమయింది.అయితే రెండో టీ20 మ్యాచ్ కు ముందు టీమిండియాను గాయాలు కలవరపెడుతున్నాయి.. యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్, యువ పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరంగా ఉండనున్నారు.. వారి స్థానాల్లో దీపక్ హుడా, శార్ధూల్ ఠాకూర్, తుదిజట్టులోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అలాగే తొలి మ్యాచ్ లో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. భువికి ఈ సీరీస్ కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో తుది జట్టు నుంచి తప్పించే సాహసం చేయకపోవచ్చు.
అటు బ్యాటింగ్ లో రోహిత్ శర్మ తో కలిసి యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ మరోసారి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.. అలాగే మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు రానుండగా.. నాలుగో స్థానంలో సూర్య కుమార్ యాదవ్, ఐదో స్థానంలో రిషబ్ పంత్ ఆడనున్నారు. తొలి టీ20లోను విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. కనీసం ఈ మ్యాచ్లోనైనా అతను రాణించాల్సి ఉంది. ఇక రిషభ్ పంత్ సైతం ఆకట్టుకోలేకపోయాడు. అతను కూడా ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.
కాగా ఈ మ్యాచ్ లో స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా యజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ మరోసారి బరిలోకి దిగనున్నారు. అరంగేట్రం లోనే అదరగొట్టిన రవి బీష్ణోయ్ పై మరోసారి అంచనాలు నెలకొన్నాయి. టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం జట్టును సన్నద్ధం చేసే క్రమంలో ఆల్ రౌండర్ గా దీపక్ చాహర్ స్థానంలో శార్దూల్ ఆడించే అవకాశం ఉంది. మరోవైపు సీరీస్ చేజారకుండా ఉండాలంటే విండీస్ కు ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి. టీ ట్వంటీ ఫార్మాట్ లో చెలరేగి ఆడే విండీస్ ఆటగాళ్ళు కనీస పోటీ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్య పరుస్తోంది.
Related News
New Coach: టీమిండియాకు త్వరలో కొత్త కోచ్..?
భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన పెద్ద వార్త బయటకు వస్తోంది.