HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >India Vs England Ind 356 All Out 50 Overs Vs Eng In Ahmedabad

India vs England: చిత‌క్కొట్టిన భార‌త్ బ్యాట‌ర్లు.. ఇంగ్లాండ్ ముందు భారీ ల‌క్ష్యం!

50 ఓవర్లలో భారత్ 10 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ 50 ఓవర్లలో 357 పరుగులు చేయాలి.

  • By Gopichand Published Date - 05:42 PM, Wed - 12 February 25
  • daily-hunt
India vs England
India vs England

India vs England: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య వన్డే సిరీస్ చివరి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తన ప్లే 11లో మూడు ప్రధాన మార్పులు చేసి బ‌రిలోకి దిగింది.ఇదే సమయంలో ఇంగ్లాండ్ తన జ‌ట్టులో ఒక మార్పు చేసింది. ఇప్పటికే సిరీస్‌లో టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది.

Also Read: Green Armbands: గ్రీన్ రిబ్బన్ ధ‌రించిన‌ ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?

50 ఓవర్లలో భారత్ 10 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ 50 ఓవర్లలో 357 పరుగులు చేయాలి. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు.

మూడో వన్డేలో ఇంగ్లండ్‌కు భారత్ 357 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. క్లీన్ స్వీప్ తప్పించుకోవడానికి బ్రిటీష్ 357 పరుగులు చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు భారత్‌ తరఫున శుభ్‌మన్‌ గిల్‌ అద్భుత సెంచ‌రీ చేశాడు. గిల్ 102 బంతుల్లో 112 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.శ్రేయాస్ అయ్యర్ 64 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 10 ఓవర్లలో 64 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అలాగే మార్క్ వుడ్ 2 వికెట్లు తీశాడు. సాకిబ్ మహమూద్, గుస్ అట్కిన్సన్, జో రూట్ త‌లో వికెట్ తీశారు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత‌ సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం గిల్‌కు చాలా ప్రత్యేకమైనది. ఈ మైదానంలో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడో వన్డేలో గిల్ 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతని వన్డే కెరీర్‌లో ఇది 7వ సెంచరీ. ఈ ఫార్మాట్‌లో గిల్ 507 రోజుల తర్వాత సెంచరీ సాధించాడు. అతను తన చివరి సెంచరీని 24 సెప్టెంబర్ 2023న ఆస్ట్రేలియాపై సాధించాడు.

ఇంగ్లండ్‌పై సెంచరీ చేసిన గిల్ వరుస రికార్డులు సృష్టించాడు. భారత తొలి ఆటగాడిగా శుభ్‌మన్‌ నిలిచాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన బ్యాటర్ గిల్ కావ‌డం విశేషం. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 7 సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ నిలిచాడు. ఈ ఘనత సాధించడానికి అతను కేవలం 50 వన్డే మ్యాచ్‌లు మాత్రమే తీసుకున్నాడు. తన 50వ వన్డేలో సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రికార్డు శుభ్‌మన్ గిల్ పేరిట నమోదైంది. ఇక్కడికి చేరుకోవడానికి గిల్‌కి 50 ఇన్నింగ్స్‌లు పట్టింది. హషీమ్ ఆమ్లా 2500 పరుగులు చేసేందుకు 51 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 50 వన్డేల్లో గిల్ 2587 పరుగులు చేశాడు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd