India vs England: చితక్కొట్టిన భారత్ బ్యాటర్లు.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం!
50 ఓవర్లలో భారత్ 10 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ 50 ఓవర్లలో 357 పరుగులు చేయాలి.
- Author : Gopichand
Date : 12-02-2025 - 5:42 IST
Published By : Hashtagu Telugu Desk
India vs England: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య వన్డే సిరీస్ చివరి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తన ప్లే 11లో మూడు ప్రధాన మార్పులు చేసి బరిలోకి దిగింది.ఇదే సమయంలో ఇంగ్లాండ్ తన జట్టులో ఒక మార్పు చేసింది. ఇప్పటికే సిరీస్లో టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది.
Also Read: Green Armbands: గ్రీన్ రిబ్బన్ ధరించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?
50 ఓవర్లలో భారత్ 10 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ 50 ఓవర్లలో 357 పరుగులు చేయాలి. భారత్ తరఫున శుభ్మన్ గిల్ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
మూడో వన్డేలో ఇంగ్లండ్కు భారత్ 357 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. క్లీన్ స్వీప్ తప్పించుకోవడానికి బ్రిటీష్ 357 పరుగులు చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు భారత్ తరఫున శుభ్మన్ గిల్ అద్భుత సెంచరీ చేశాడు. గిల్ 102 బంతుల్లో 112 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.శ్రేయాస్ అయ్యర్ 64 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 10 ఓవర్లలో 64 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అలాగే మార్క్ వుడ్ 2 వికెట్లు తీశాడు. సాకిబ్ మహమూద్, గుస్ అట్కిన్సన్, జో రూట్ తలో వికెట్ తీశారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లోని మూడో మ్యాచ్లో శుభ్మన్ గిల్ అద్భుత సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం గిల్కు చాలా ప్రత్యేకమైనది. ఈ మైదానంలో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. మూడో వన్డేలో గిల్ 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతని వన్డే కెరీర్లో ఇది 7వ సెంచరీ. ఈ ఫార్మాట్లో గిల్ 507 రోజుల తర్వాత సెంచరీ సాధించాడు. అతను తన చివరి సెంచరీని 24 సెప్టెంబర్ 2023న ఆస్ట్రేలియాపై సాధించాడు.
ఇంగ్లండ్పై సెంచరీ చేసిన గిల్ వరుస రికార్డులు సృష్టించాడు. భారత తొలి ఆటగాడిగా శుభ్మన్ నిలిచాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన బ్యాటర్ గిల్ కావడం విశేషం. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 7 సెంచరీలు చేసిన భారత బ్యాట్స్మెన్గా శుభ్మన్ నిలిచాడు. ఈ ఘనత సాధించడానికి అతను కేవలం 50 వన్డే మ్యాచ్లు మాత్రమే తీసుకున్నాడు. తన 50వ వన్డేలో సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రికార్డు శుభ్మన్ గిల్ పేరిట నమోదైంది. ఇక్కడికి చేరుకోవడానికి గిల్కి 50 ఇన్నింగ్స్లు పట్టింది. హషీమ్ ఆమ్లా 2500 పరుగులు చేసేందుకు 51 ఇన్నింగ్స్లు ఆడాడు. 50 వన్డేల్లో గిల్ 2587 పరుగులు చేశాడు.