AP High Court:ఏపీ ప్రభుత్వ సలహాదారు శ్రీకాంత్ నియామకాన్ని నిలుపుదల చేసిన హైకోర్టు
ఏపీ ప్రభుత్వంలో దేవదాయ శాఖ సలహాదారుగా నియమితులైన జె.శ్రీకాంత్ నియామకాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
- By Hashtag U Published Date - 02:36 PM, Wed - 24 August 22
ఏపీ ప్రభుత్వంలో దేవదాయ శాఖ సలహాదారుగా నియమితులైన జె.శ్రీకాంత్ నియామకాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేవదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్ను ఏపీ ప్రభుత్వం నియమించిన సమయంలోనే పలు సంఘాలు అభ్యంతరం తెలిపాయి. అయితే ఆ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దేవదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్ నియామకం నిబంధనలకు విరుద్ధమని వారు తమ పిటిషన్లలో హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పిటిషనర్ల వాదనలు సరైనవేనని భావించిన హైకోర్టు… శ్రీకాంత్ నియామక ఉత్తర్వులపై స్టే విధించింది.
Related News
Jana Sena Symbol : జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్..
జనసేన (Janasena) పార్టీ కి భారీ షాక్ తగిలింది..పార్టీ కి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును (Glass Tumbler Symbol) రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టు లో RPC పార్టీ పిటిషన్ వేసింది. దీనిపై కోర్ట్ విచారణ జరపనుంది. రీసెంట్ గా జనసేనకు గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఇ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక �