Gummanur Jayaram : టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరామ్
- By Kavya Krishna Published Date - 07:11 PM, Tue - 5 March 24
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రోజు రోజుకు వైసీపీని వీడి టీడీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. జగన్ నిర్ణయాలతో విసిగిపోయిన కొందరు నేతలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. అయితే.. తాజాగా గుమ్మనూరి జయరామ్ టీడీపీలో చేరారు. మంగళగిరిలో టీడీపీ నిర్వహిస్తోన్న జయహో బీసీ సభలో గుమ్మనూరు జయరాం టీడీపీలో తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సమక్షంలో గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన (Janasena) పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఉన్నారు. గుమ్మనూరు జయరాంకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఈ క్రమంలో, గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ… టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషం కలిగిస్తోందని ఆయన వెల్లడించారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని, చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటే.. జగన్ కుమ్మక్కు ప్లాన్ లో భాగంగా ఆలూరు ఎమ్మెల్యే టిక్కెట్టును కోల్పోయిన గుమ్మనూరులో జగన్ తో విభేదాలు వచ్చాయి. వైసీపీ వర్గానికి దూరమై టీడీపీ అధిష్టానంతో టచ్లో ఉన్నారు. గత కొన్ని వారాలుగా ఇలా ఉత్కంఠ భరితంగా సాగిన ఆయన ఎట్టకేలకు వైసీపీని వీడితున్నట్లు తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో గుమ్మనూరు అధికారికంగా టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగానే చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.
కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని జగన్ అడిగారని, దానికి నేను ఆమోదం తెలపలేదని జయరాం అన్నారు. జగన్ దగ్గర సజ్జల, ధనుంజయ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అందరి వాతావరణాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఈ దఫా టీడీపీ నుంచి ఆలూరు ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.
Read Also : Chandrababu : చంద్రబాబుకు ఇది క్లిష్టమైనదే..!
Related News
LS Polls : ఓటు వేస్తూ సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ పెట్టిన బీజేపీ నేత కుమారుడు..!
ప్రస్తుతం దేశంలో దశలవారీగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.