IPL Match: గుజరాత్ జోరుకు చెన్నై బ్రేక్ వేస్తుందా ?
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర సమరం జరుగనుంది.
- By Naresh Kumar Published Date - 05:39 PM, Sun - 17 April 22
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఎంసీఏ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింటిలో గెలుపొంది, పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో ఒక్క విజయంతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ టైటాన్ స్ తో జరగనున్న మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకువెళ్లాలని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భావిస్తోంది.
ఈ క్రమంలోనే టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నితీష్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను ఎదుర్కొనేందుకు చెన్నై ఆటగాళ్లు నెట్స్ లో చెమటోడ్చారు. ఈ నేపథ్యంలోనే ధోని అచ్చంగా రషీద్ ఖాన్ లా బౌలింగ్ చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేయించాడు. ప్రస్తుతం ధోని స్పిన్నర్ అవతరమెత్తి బౌలింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక ఈ రోజు మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టును పరిశీలిస్తే… రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప ఓపెనర్లుగా రానుండగా , మూడో స్థానంలో మొయిన్ అలీ, మిడిలార్డర్ లో అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, లోయర్ ఆర్డర్ లో శివమ్ దూబే, ఎంఎస్ ధోని , బ్యాటింగ్ కు రానున్నారు అలాగే చెన్నై జట్టు బౌలింగ్ బాధ్యతలని డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, క్రిస్ జోర్డాన్, ముఖేష్ చౌదరి మోయనున్నారు.
Related News
Gujarat Titans Team Penalised : చెన్నై పై విజయం.. గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తానికి భారీ జరిమానా.. కెప్టెన్కు గిల్కు ఏకంగా..
చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది.