Vijayawada : విజయవాడలో కస్టమ్స్ అధికారుల తనిఖీ.. అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం
విజయవాడలో బంగరాన్ని అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.7.48 కోట్ల
- By Prasad Published Date - 08:03 AM, Thu - 23 March 23
విజయవాడలో బంగరాన్ని అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.7.48 కోట్ల రూపాయల విలువ చేసే 12.97 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. నెల్లూరు, విజయవాడ, సూళ్లూరుపేట వంటి పలు ప్రాంతాల్లో బస్సులు, కార్లు, రైళ్లలో వివిధ ప్రజారవాణా మార్గాల్లో ప్రయాణిస్తున్న స్మగ్లింగ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో రూ. 7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారి తెలిపారు.బంగారం అక్రమంగా తరలిస్తున్న స్వభావాన్ని మభ్యపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా విదేశీ మార్కులను తారుమారు చేశారని అధికారులు తెలిపారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110 కింద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, చట్టంలోని సెక్షన్ 104 కింద నిందితులను అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.
Related News
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు ?
Phone Tapping Case: బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.