Gold And Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు దిగి వచ్చాయి. నేడు 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం రూ.650, స్వచ్ఛమైన పసిడి రూ. 720 చొప్పున దిగి వచ్చాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి.
- Author : Gopichand
Date : 09-03-2023 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు దిగి వచ్చాయి. నేడు 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం రూ.650, స్వచ్ఛమైన పసిడి రూ. 720 చొప్పున దిగి వచ్చాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. గురువారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.55,630గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 67,500 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (మార్చి 09, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,780గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.51,620 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,320గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.55,630 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,680గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,550 ఉండగా, ముంబైలో రూ.65,550గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, కోల్కతాలో రూ.65,550గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, కేరళలో రూ.67,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, విజయవాడలో రూ.67,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.